పుస్తక ప్రపంచం29 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 1922 లో జేమ్స్ జాస్ రాసిన యులెసిస్ నవల ప్రభంజనం సృష్టించింది.సస్పెన్స్ బాధ ఫన్నీ తో కూడిన నవల.ఒకేఒక రోజున ముగ్గురు సామాన్య వ్యక్తుల జీవిత చిత్రణ ఇందులో చూస్తాం.డబ్లిన్, ఐర్లాండ్ భూమికగా పురాణాలు,యూరోపియన్ చరిత్ర,  మతం,జ్యోతిష ఖగోళవిషయాల్ని కథాంశంతో తీసుకున్న నవల.చురకలు,వ్యంగ్యహేళనతో  కొత్త పంథాలో సాగింది.అడాల్ఫ్ హిట్లర్ రాసిన పుస్తకం",,మెన్కాంఫ్" లో తన జీవితంని చిత్రించాడు నాజీపార్టీ జర్మన్ నియంత. తన నమ్మకాలు జర్మన్ జాతి భవిష్యత్తు రాజకీయాలు,ఆర్యన్ జాతి ఉద్ధరణ,జ్యూ (యూదు) జాతి నాశనం అతని పుస్తకంలో చోటుచేసుకున్నాయి.1925,1927లో రెండు వాల్యూంలుగా విడుదలైంది.ఆరచనలే 2వప్రపంచయుద్ధానికి కారణమై50మిలియన్ల జనం హతులైనారు. ఎక్కువ మంది యూదు జాతిప్రజలే.గలివర్స్ ట్రావెల్స్ రాసిన జోనథాన్ స్విఫ్ట్ ఓవింత విషయం చెప్పాడు.మార్స్  చుట్టూ ఇద్దరు చంద్రుళ్లు తిరుగుతున్నట్లు రాశాడు.1877లో ఆసెఫ్ హాల్ అనే శాస్త్రవేత్త  ఆరెండు ఫోబోస్ ,డైమోస్  మార్స్ కి ఉపగ్రహాలని కనుగొన్నాడు. ఆనాటి రచయితల దివ్యదృష్టి అని అందామా🌹
కామెంట్‌లు