పేను.... నల్లి..... చీమల కథ : -  డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన చానా పేదోడు. ఆయనకు ముగ్గురు నెమలీకల్లాంటి అందమైన ఆడపిల్లలున్నారు. వాళ్ళు ఎంతటి అందగత్తెలంటే ఆ చుట్టుపక్కల రాజ్యాలలో యాడ కూడా అంతటి అందమైన ఆడపిల్లల్లేరు. వాళ్ళ నాయన చానా పేదోడు గదా... అందుకే వాళ్ళు చిన్నప్పట్నించీ ఎండనకా, వాననకా ఒళ్ళోంచి  పొలం పనులైనా, ఇంటిపనులైనా బాగా కష్టపడి చేసేటోళ్ళు. ఒకరోజు ముగ్గురు రాజులు ఆ రాజ్యానికొచ్చి వాళ్ళ అందాన్ని చూసి "చేస్కుంటే ఇట్లాంటోళ్ళనే చేసుకోవాల" అనుకోని వాళ్ళు పేదోళ్ళైనా సరే పెండ్లి చేసుకోని వాళ్ళ రాజ్యాలకు తీసుకొని పోయినారు.
ఆ రాజులు ముగ్గురు చానా మంచోళ్ళు. పెండ్లాలను బాగా ప్రేమగా కాలు కింద పెట్టనీయకుండా చూసుకొనేటోళ్ళు. ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేటోళ్ళు. వాళ్ళకు సేవలు చేయటానికని పదిమంది దాసీలను పెట్టినారు. అట్లా కొన్నేళ్ళు తిరిగేసరికి వాళ్ళు బాగా తినీ తినీ సుఖం మరిగినారు. పెళ్ళైన నాటి నుండీ చిన్నపని కూడా చేసి ఎరుగరు కదా దాంతో నెమ్మదిగా వాళ్ళకు బాగా పొగరు బట్టింది.
ఒకరోజు పెద్దామెకు పొద్దుపోకుండా వుంటే సరదాగా పాలు పిండుదామని కుండ తీసుకోని బరగొడ్డు దగ్గర కూచోని పాలు పిండడం మొదలు పెట్టింది. పనిచేసే అలవాటు తప్పిపోయింది గదా... దాంతో పాలధార వచ్చి ఆమె కాలు మీద పడింది. అంతే... ఆ కాసింత దానికే ఆమె కాలు సుర్రుమనింది. అదే సమయంలో అటువేపుగా వచ్చిన ఆమె మొగుడు అది చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోయినాడు.
దాంతో ఆమెకు తెగ కోపమొచ్చేసింది. “అరెరే... వీడేం మొగుడు. పాలధార వచ్చి నా కాలు మీద పడి నొప్పితో విలవిలలాడుతా వుంటే.... చూసి కూడా... అయ్యో! పాలధార పడి నీకాలెంత నొచ్చిందో... ఏమో... అని ఒక్క మాట కూడా అనకపాయనే. ఇట్లాంటి మొగున్తో కాపురం చేస్తేనేమి.... చెయ్యకుంటేనేమి" అని అలిగి మొగున్నొదిలేసి పుట్టింటికి బైలుదేరింది.
అదేరోజు నడిపామె దాసీలను పిలిచి “చానా రోజుల నుండి నాకు బాళ్ళపాయసం తినాలనుంది. నెయ్యి, జీడిపప్పు వేసి ఘుమఘుమలాడేలా బాగా చెయ్యండి" అనింది. సరేనని వాళ్ళు బాళ్ళపాయసం చేసి ఒక పెద్దచెంబు నిండా పోసుకోనొచ్చినారు. ఆమె ఒక్కసారిగా చెంబెత్తి పాయసం మొత్తం గటగటా తాగేసరికి గొంతు నొచ్చింది. అదే సమయంలో అటువేపుగా వచ్చిన ఆమె మొగుడు అది చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయినాడు. దాంతో ఆమెకు తెగ కోపమొచ్చేసింది. “అరెరే... వీడేం మొగుడు. చెంబుడు పాయసం కష్టపడి తాగేసరికి నా గొంతు నొప్పి పెడితే... చూసి కూడా... అయ్యో ఇంత పాయసం తాగేసరికి నీ గొంతు ఎంత
నొచ్చిందో... ఏమో... అని ఒక్కమాట గూడా అనకపాయనే. ఇట్లాంటి మొగున్తో కాపురం చేస్తేనేమి... చెయ్యకుంటే నేమి” అని అలిగి మొగున్నొదిలేసి ఆమె కూడా పుట్టింటికి బైలుదేరింది.
అదేరోజు చిన్నామె “ఎప్పుడూ దూది పరుపు మీదనే పన్నుకుంటే ఏం సుఖముంటాది... ఒక్క రోజన్నా మల్లెపూల మంచం మీద పన్నుకోని సూడాల" అనుకోని దాసీలతో గంపలు గంపలు మల్లెపూలు మంచం పైన పరిపిచ్చుకోని పండుకోనింది. ఆ మల్లెపూలు ఆమెకు గుచ్చుకోని ఆ కాసింత దానికే ఆమె నడుం
ఎర్రగా కందిపోయింది. అదే సమయంలో అటువేపుగా వచ్చిన ఆమె మొగుడు అది చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయినాడు.
దాంతో... ఆమెకు తెగ కోపమొచ్చేసింది. “అరెరే... వీడేం మొగుడు. మల్లెపూలు గుచ్చుకోని నా నడుం కందిపోతే... చూసి కూడా... అయ్యో... మల్లెపూలు గుచ్చుకోని నీ నడుం ఎంత కందిపొయిందో... ఏమో... అని ఒక్కమాట కూడా అనకపాయనే... ఇట్లాంటి మొగున్తో కాపురం చేస్తేనేమి... చేయకుంటే నేమి” అని అలిగి ఆమె కూడా మొగున్నొదిలేసి పుట్టింటికి బైలుదేరింది.
అట్లా వాళ్ళు ముగ్గురూ మొగుళ్ళనొదిలేసి పుట్టింటికి వస్తా వస్తా దారి మధ్యలో కలుసుకున్నారు. “ఏంది నీ కత అంటే ఏంది నీ కత' అంటూ జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకుని బోరుమన్నారు.
అట్లా ముగ్గురూ ఏడ్చుకుంటా... అడవిలో పోతా వుంటే దారిలో ఒక ముని కనబడి “ఏందమ్మా మీ బాధ... ఏమట్లా ఏడుస్తా వున్నారు" అనడిగినాడు.
దానికి వాళ్ళు కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా “ఏం చేద్దాం సామీ! అంతా మా కర్మ. మా నాయన మంచి సంబంధాలని చెప్పి ఆ మాయదారి సచ్చినోళ్ళకిచ్చి పెండ్లి చేసినాడు. వాళ్ళ కసలు పెండ్లాలను ఎట్లా ప్రేమగా చూసుకోవాల్నో గూడా తెలీదు. అందుకే అట్లాంటోళ్ళతో కాపురం చేయలేక వదిలేసొస్తిమి" అంటూ జరిగిందంతా చెప్పినారు.
వాళ్ళు చెప్పిందంతా వినేసరికి ఆ మునికి చానా కోపమొచ్చేసింది. “ఓరినీ... ఏమో... అనుకుంటిని గానీ... మీ ముగ్గురికీ పనీపాటా లేక... బాగా ఒళ్ళు కొవ్వు పట్టినట్టుంది. అందుకే ఇంత సిన్న సిన్న దాన్లక్కూడా ఓ అని మొగుళ్ళనొదిలేసి వస్తా వున్నారు. వుండు మీ పని చెబుతా" అని పెద్దామెను పేను కమ్మని, నడిపామెని నల్లి కమ్మని, చిన్నామెను చీమ కమ్మని శపించినాడు. అంతే... ముని శాపం తగిలి పెద్దామె పేనైపోయింది. నడిపామె నల్లయిపోయింది. చిన్నామె చీమైపోయింది. ఇదీ నల్లి, పేను, చీమల కథ.
***********
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం