భాగవతంలో ప్రియ వ్రతుడు అచ్యుతుని రాజ్యశ్రీ

 స్వాయంభవు మనువు కొడుకు ప్రియవ్రతుడు గొప్ప భక్తీ తత్పరుడు సదా దైవస్మరణలో ఉండేవాడు నారుదుడి శిష్యునిగా అతను గంధమాదన పర్వతంలో తపస్సు చేసి వైరాగ్యభావాన్ని పొందాడు రాజ్యం వద్దు అన్నాడు ఈ ప్రకృతితో సంబంధం లేదన్నాడు అప్పుడు బ్రహ్మ వచ్చి నాయనా నీవు రాజ్యభారం వహించాలి గృహస్థ ఆశ్రమం స్వీకరించాలి వేదాన్ని రక్షించాలి వేదాలు అంటే ఈశ్వరాజ్ఞ వేదాలకే ఘన జట ఉంటాయి గురువుల దగ్గరే విని శృతిని నేర్చుకోవాలి వేదం శృతి స్వరూపిణి శబ్ద స్వరూపిణి అప్పుడు ప్రియ వ్రతుడు గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి ఒప్పుకున్నాడు విశ్వకర్మ కూతురు బహిష్మతిని పెళ్లి చేసుకున్నాడు పదిమంది కొడుకులు ఉజ్జస్వతి అనే కూతురు పుట్టారు ఆయన మహారాజు అయినా అంతా ఈశ్వరానుగ్రహం అనేవాడు యోగి లాగా సమాధి స్థితిని పొందేవాడు అలా ప్రియ వ్రతుడు భక్తితో మేరు పర్వతం మీరు పర్వతం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడు సూర్యాస్తమయం కాగానే అక్కడ తనే వెళ్లి సూర్యుని లాగా ప్రకాశించేవాడు ఆయన రథయాత్ర వల్ల సప్త సముద్రాలు ద్వీపాలు ఏర్పడ్డాయి పోతన తన తెలుగు భాగవతంలో ప్రియ భరతుని భక్తిని గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా తేట తెలుగులో పద్యాల రూపంలో వర్ణించాడు పోతన పద్యాలు ప్రతివారు నేర్చుకుంటే తెలుగు భాష మీద పట్టు ఏర్పడుతుంది🌹
కామెంట్‌లు