అష్టాక్షరీ మంత్రం ప్రాశస్థ్యం :-సి.హెచ్.ప్రతాప్
 ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.ఈ మంత్రం యొక్క ఋషి సాధ్య నారాయణ, ఛందస్సు గయాత్రి మరియు మహావిష్ణువు దేవత.పురశ్చరణకు నిర్దేశించిన సంఖ్య 8 లక్షలు (అష్ట లక్ష).అయితే, శాస్త్రాలు సూచించినట్లుగా, కలియుగంలో సూచించబడిన సంఖ్య నాలుగు రెట్లు, అంటే 32 లక్షలు.విష్ణువు అనుగ్రహం పొందడానికి నిత్య కర్మ తర్వాత ప్రతిరోజూ 1000 సార్లు మంత్రాన్ని పఠించాలి.లేకపోతే, ప్రతిరోజూ 108 సార్లు మంత్రాన్ని పఠించాలి, ముఖ్యంగా ద్వదశి రోజున.లక్ష మంత్రాలను పఠించడం ద్వారా ఆత్మశుద్ధిని పొందుతారు.రెండు లక్షలతో మంత్ర శుద్ధి లభిస్తుంది అని శాస్త్ర వచనం.
ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే అయిన శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించే సనయంలో  లక్ష్మీనారాయణునిగా, విద్య, జ్!నాలను పేసాదించేటప్పుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించే  లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదిస్తున్నాడు.సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆత్మ శుద్ధి కలుగుతుంది మరియు పాపాలు తొలగిపోతాయి.ఈ మంత్రాన్ని ప్రతిదినం జపించే వారికి మోక్షం లభిస్తుంది.
 

కామెంట్‌లు