కాప్రా మల్కాజగిరి కవుల వేదిక నిర్వహించిన కార్మిక దినోత్సవం, కవిసమ్మేళనం రాధా కుసుమగారికి బిరుదు ప్రదానం గురువారం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ముఖ్య అతిధి మరియు మాజీ రిజిస్ట్రార్, తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ త్రిమూర్తుల గౌరీశంకర్ అమెరికాలో ముందు ప్ర్రారంభమయిన మేడే ఉద్యమాల గురంచి చక్కగా వివరించారు. విశిష్ట అతిధి శ్రీ నాళేశ్వరం శంకరం మేడే పుట్టుపూర్వోత్తర విషయాలను చాలా చక్కగా వివరించారు. మాజీ పోలీసు అధికారి పెద్దూరి వెంకట దాస్ కార్మిక దినోత్సవ విషయాలను అనుభూతులను తెలియజేశారు. మేడే కార్యక్రమానికి శ్రీ తులసీ వెంకట రమణాచార్య మొదట స్వాగత వచనాలను పలికి అతిధులను వేదిక మీదకు స్వాగతించారు.
సభాధ్యక్షులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ అతిధులను మరియు కవులను స్వాగతించి, కార్మిక దినోత్సవ విశేషాలను వివరించి కార్మికులకు, కర్షకులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీపోలీసు అధికారి శ్రీ వెంకట దాస్ గారు మేడే ఆవిర్భావం గురించి మన భారతదేశ కార్మిక కర్షక దినోత్సవ విశిష్టతలను వివరించారు.
అష్ట శతాధిక కవిసమ్మేళనాళను నిర్వహించిన తొలి దళితకవి కుసుమ ధర్మన్న మనుమరాలు డాక్టర్ రాధా కుసుమ గారికి కవిసమ్మేళన ప్రవీణ బిరుదును ప్రదానం చేసి, శాలువాలతో సత్కరించి, సన్మానపత్ర పటము సమర్పించి, చదివి వినిపించి అందరినీ సంతసపరిచారు. సమన్వయకర్త దీపక్ న్యాతి రాధా కుసుమ గారిని దుశ్శాలువతో కప్పి సత్కరించారు. పాల్గొన్న కవులందరూ తమ సొంత ఇంటి ఆడపడచుగా భావించి, పూల దండలు వేసి, పుష్పాలు చల్లి విన్నూతనంగా సన్మానించారు. విశిష్టమయిన బిరుదునిచ్చి గౌరవించినందుకు పాల్గొన్న వారందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
కార్మిక కర్షకుల అంశంపై జరిగిన కవిసమ్మేళనమును డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా నిర్వహించారు. మౌనశ్రీ మల్లిక్, రాధా కుసుమ, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, తులసి వెంకట రమణాచార్యులు, పొన్నాల ధనమ్మ, మంత్రిప్రగడ మార్కండేయులు, కోకిల సుజాత, బుక్కపట్నం రమాదేవి, సురేష్, నిమ్మగడ్డ క్రిష్ణ, దుబ్బా భాస్కరరావు, కట్టా శ్యామలాదేవి, నాగరాజు, తైతల అంజయ్య, అవుసలి ఆంజనేయులు, ఆనం ఆశ్రితారెడ్డి, కవిరత్న భారతి, వడ్డేపల్లి నరసింగరావు, అమీనా కలందర్, మేడిసెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ పులిమి పద్మావతి, కె. విజయకుమార్, మధు, వడ్డేపల్లి విజయలక్ష్మి, గిరిప్రసాద్, లలితా చండి, విజయశ్రీ, దేవి గాయత్రి, చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, హరిప్రసాద్, లింగాల శ్రీనివాస్, గొర్రెపాటి శ్రీను, మల్లేశం యాదవ్, మనోహర్, ధనుంజయ్, రమణమూర్తి(శరత్ కవి) , శ్రీధర్, గుర్రం సురేష్ భాబు, గుర్రం నిర్మల మొదలు కవులు కార్మిక కర్షకులపై చక్కని కవితలు వినిపించి అందరినీ ఆహ్లాద పరిచారు.
పొన్నాల ధనమ్మ వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అతిధులు మరియు కవులు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్.
సమన్వయకర్త, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక. భాగ్యనగరం
సభాధ్యక్షులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ అతిధులను మరియు కవులను స్వాగతించి, కార్మిక దినోత్సవ విశేషాలను వివరించి కార్మికులకు, కర్షకులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీపోలీసు అధికారి శ్రీ వెంకట దాస్ గారు మేడే ఆవిర్భావం గురించి మన భారతదేశ కార్మిక కర్షక దినోత్సవ విశిష్టతలను వివరించారు.
అష్ట శతాధిక కవిసమ్మేళనాళను నిర్వహించిన తొలి దళితకవి కుసుమ ధర్మన్న మనుమరాలు డాక్టర్ రాధా కుసుమ గారికి కవిసమ్మేళన ప్రవీణ బిరుదును ప్రదానం చేసి, శాలువాలతో సత్కరించి, సన్మానపత్ర పటము సమర్పించి, చదివి వినిపించి అందరినీ సంతసపరిచారు. సమన్వయకర్త దీపక్ న్యాతి రాధా కుసుమ గారిని దుశ్శాలువతో కప్పి సత్కరించారు. పాల్గొన్న కవులందరూ తమ సొంత ఇంటి ఆడపడచుగా భావించి, పూల దండలు వేసి, పుష్పాలు చల్లి విన్నూతనంగా సన్మానించారు. విశిష్టమయిన బిరుదునిచ్చి గౌరవించినందుకు పాల్గొన్న వారందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
కార్మిక కర్షకుల అంశంపై జరిగిన కవిసమ్మేళనమును డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా నిర్వహించారు. మౌనశ్రీ మల్లిక్, రాధా కుసుమ, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, తులసి వెంకట రమణాచార్యులు, పొన్నాల ధనమ్మ, మంత్రిప్రగడ మార్కండేయులు, కోకిల సుజాత, బుక్కపట్నం రమాదేవి, సురేష్, నిమ్మగడ్డ క్రిష్ణ, దుబ్బా భాస్కరరావు, కట్టా శ్యామలాదేవి, నాగరాజు, తైతల అంజయ్య, అవుసలి ఆంజనేయులు, ఆనం ఆశ్రితారెడ్డి, కవిరత్న భారతి, వడ్డేపల్లి నరసింగరావు, అమీనా కలందర్, మేడిసెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ పులిమి పద్మావతి, కె. విజయకుమార్, మధు, వడ్డేపల్లి విజయలక్ష్మి, గిరిప్రసాద్, లలితా చండి, విజయశ్రీ, దేవి గాయత్రి, చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, హరిప్రసాద్, లింగాల శ్రీనివాస్, గొర్రెపాటి శ్రీను, మల్లేశం యాదవ్, మనోహర్, ధనుంజయ్, రమణమూర్తి(శరత్ కవి) , శ్రీధర్, గుర్రం సురేష్ భాబు, గుర్రం నిర్మల మొదలు కవులు కార్మిక కర్షకులపై చక్కని కవితలు వినిపించి అందరినీ ఆహ్లాద పరిచారు.
పొన్నాల ధనమ్మ వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది. మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అతిధులు మరియు కవులు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్.
సమన్వయకర్త, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక. భాగ్యనగరం
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి