శిల్పకారుడి తియ్యని స్వప్నము:- డా.ధనాసి ఉషారాణి- ప్రముఖ సింగర్, యాంకర్

 కిలేశ్వర మహారాజు  సిరిపురము ఆస్థానములో చాలా గొప్పవాడని తెలివితేటలలో గొప్ప మొనగాడని ప్రజలు మధ్యలో ఓ నానుడు నాటుకు పోయింది. దేశ దేశాలకు చాటిoపు వేయండి  మహా భటులార  శిల్పకళాకారులను పిలిపించి రాజు గారి పోలికతో   శిల్పము చెక్కి తేవాలని రాజు ఆజ్ఞ  ఇచ్చాడు.ఓ అద్భుత మేధస్సు కలిగినట్టి శిల్పకారుడు బాగా ఆలోచించి ఒక్కసారైనా రాజ్యముకి రాజు కావాలని తన స్వప్నంలో బ్రతుకుతున్న కాలిఖేస్వర్ కి ఓ అద్భుత అవకాశము అని మనసులో నిండుగా 
తన చేతిలోని మూడు బొమ్మలు రాజు ముందు వుంచాడు. రాజా... ఈ బొమ్మలు చూడ్డానికి ఏదో చిత్రములా  ఒకేలా వున్నా ఇందులో చాలా తేడా  వుంది. ఈ సభలో ఏవరైనా ఆ రహస్యం కనిపెట్టగలరా అని సవాలు విసిరాడు రాజు వాటిలోన సుందరత్వము ఉలికి పడుతూ వుంది అన్నీ నాలాగే బాగున్నాయి అని రాజు అన్నారు.
అందరూ వాటిని పరిశీలించి సంతోషములో మునిగి పోయారు ఎక్కడా కొంచంగూడా తేడా లేదు. ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కాలేదు. 
 రాజ్యపు మంత్రి  త్రిలోపాత్యడు మహా మేధావి. ఏటువంటి చిక్కుముడి అయినా విప్పగల శక్తి గలవాడు. అతడు అచ్చు గుద్దినట్లు ఒకేలా వున్న ఆ మూడు బొమ్మలను చూసి
మంత్రి చిరునవ్వు నవ్వుతూ రాజా...ఇవి మూడును మీవే చిత్రాలు కానీ ఒక్కటేమో రాజసము ఉట్టిపడేలా రాజ  వైభోగము కనిపిస్తూ వుంది అంటే మీ పాలనలో రాజ్యము కలకల లాడుతూ వుందని తెలుస్తూ వుంది.మరొక్క చిత్రమెమో  కలము పట్టి నవ రసాలు వొలుకుతూ సరిగమలు పటిస్తూ ఉందని దీని ద్వారా రాబోయే  పది తరములు  జాతి వైభోగము  గురించి  మీ రచనలు ద్వారా మేలు కొల్పుతుందని తెలుస్తుంది. మూడో చిత్రమెమో  హలము బట్టి  రైతు జన ఆవాసంలోకి వెళ్లి దేశ ప్రగతికి అన్నము ప్రసాదించు నిండు అన్నపూర్ణేశ్వరుడులా  సువర్ణ అక్షరములు తో ఘన కీర్తి జనుల గుండెల్లో లిఖించబడేలా ఉందని అని మంత్రి ముచ్చటిoచారు. 
 శిల్పముల గొప్పదము బాగా వివరించారు మహా మంత్రి ఐతే ఇప్పుడు ఓ పరీక్షను  పెట్టదలిచాను.వజ్రములు పొదిగిన  మణి హారము మూడు శిల్పాలులో ఒక్కదానిలో ఉంచాను అదే శిల్పమో కని పెట్టండి అన్నాడు మహారాజు. అప్పుడు ప్రజలు అందరూ మహారాజా కిరీటం పెట్టుకున్న దానిలో ఉంటుందని గట్టిగా కేకలు వేసి చేప్పారు.సభ ప్రాంగణంలో అట్టహాసముగా కేకలు వినిపించసాగాయి  అప్పుడు మహా రాజు చిరునవ్వుతో ఓ మహా మంత్రి  నీవైనను చేప్పు  అన్నంతనే  కలము పట్టుకున్న శిల్పములో  వజ్రాల హారము ఉందని చేప్పారు మహామంత్రి చిన్నగా  చిరునవ్వు నవ్వుతూ శిల్పకారుడు వైపు చూసాడు మహారాజ   నీవైనా  సమాధానం ఇవ్వమని  అడిగారు

 శిల్పకారుడు మహారాజా నా దొక తీరని స్వప్నo వుంది మహారాజా నీను  వజ్రపు హారము ఏ శిల్పములో వుంది చేబుతాను ఒక్కసారి నన్ను రాజ్యపు సింహాసనములో ఒక్కరోజైనా రాజుగా నియమిస్తారా అని అడిగాడు శిల్పకారుడు.రాజు నివ్వరపోయాడు ఓక్కసారిగా సభ ఆశ్చర్యంలో మునిగి పోయింది. అప్పుడు శిల్పకారుడు  విజ్రాలహారము హలము పట్టుకున్న  శిల్పములో ఉందని చేప్పాడు శిల్పకారుడు. ఇంకేముంది రాజు మనో చిత్తములో వున్న విషయాన్ని పసిగట్టాడు  శిల్పకారుడు. రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడి  వజ్రాల హారము శిల్పకారుడి మెడలో వేసి  సింహాసనo మీద కూర్చోబెట్టి  రైతే రాజని సిత్రములో చూపిన నైపుణ్యంకు జోహార్ అంటూ శిల్పకారుడిని ఒక్క రోజు మహా రాజుగా నియమించారు కిలేశ్వర మహారాజు. దేశ భవితకి రైతే నిజమైన సంపదని  శిల్పకారుడి గొప్పదన్నాన్ని శిలా శాసనముల్లో  లిఖించాడు మహారాజు. గుప్పెడు మెతుకులతో ప్రాణము పెట్టె రైతే గొప్పవాడని చాటిన  కాలికేశ్వర్ హుందాతనము చరిత్ర పుటల్లో మహారాజుగా నిలిపింది. తీరని శ్రమే మనిషిని విజయ బాటలో నిలుపుతూ విజేతగా నిలువునని శిల్పకారుని ద్వారా మహారాజుకు కనువిప్పు కలిగింది


కామెంట్‌లు