బాల్య మిత్రుడు సిరివెన్నెల జయంతి ఉత్సవాలలో పాల్గొన్న "అయ్యలసోమయాజుల"

  విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో ప్రముఖ సాహితీ సంస్థ విశాఖ సాహితీ  ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి డెబ్బది జయంతి సందర్భంగా "సిరివెన్నెల  భావ  విశ్లేషణ తరంగణి"  కార్యక్రమంలో  కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి పాల్గొని తన చిన్ననాటి స్నేహితుడు సిరివెన్నెల తో గల అరవై ఏండ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా సామాజిక స్పృహ కలిగి, నిత్య సంఘర్షణ తో సగటు మధ్య తరగతి మనిషి  సమస్యలు ,ఆధ్యాత్మిక, సనాతన ధర్మ విషయాలు కలిగిన పాటలను వ్రాసి అనకాపల్లి నుంచి అందనంత ఎత్తుకు ఎదిగినా ఆప్యాయంగా పిలిచే 'భరణి ధరణిని వీడి వెళ్ళడం'   చాలా బాధాకరమని తెలుగు పాటకే వన్నెతెచ్చిన సీతారామశాస్త్రి పాట ఉన్నంత వరకు చిరస్మరణీయుడేనని, సిరివెన్నెల లేనిలోటు తెలుగుప్రజలకు ముఖ్యంగా తనకు తీరని లోటని వారి పాట "ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి" అన్నది నిజంగా ఆచరించిన  ఉన్నత వ్యక్తని ఆర్ద్రతతో చెప్పారు
సభకు  అధ్యక్షత డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి, గౌరవ అతిధి ప్రముఖ సాహితీవేత్త  డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, ,నంది పురస్కార గ్రహీత తిరుమల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత ,ముఖ్య అతిధి  సిరివెన్నెల గురువు శ్రీ వై. సత్యారావు మాష్టారు   మరియు అనేక మంది సాహితీ వేత్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.  కార్యక్రమాన్ని ఆద్యంతం విశాఖ సాహితీ కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల పర్యవేక్షణ లో దిగ్విజయంగా జరిగింది.
...............................
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం