అనుకున్నది సాధించాననిఅరేళ్ళయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుఅందరు కలిసి ఉండవచ్చునని భార్యవైద్యవృత్తి కి రాజీనామచేసిముగ్గురు పిల్లలతో కలసిభవిష్యత్ బంగారుమయమనుకునిలండన్ లో సుఖమయ జీవితం గడపవచ్చుననిఅందరి దీవెనలు తీసుకునిఅహమ్మదాబాద్ లో విమానం ఎక్కిసంతోషంగా భార్యా పిల్లలతో సెల్ఫీ తీసుకునికుటుంబ సభ్యులకు పంపినఅతనికి ఏమి తెలుసుఏ నిమిషానికి ఏమి జరుగుతుందన్నదితాను తీసిన సెల్ఫీయే 'చివరి సెల్ఫీ' అనితామంతా అందనిలోకాలకు వెళుతున్నామనికన్నవారి కడుపుకోతకు కారణమవుతామని"జాతస్యహి ధృవో మృత్యు: "అన్నది నిజమేభవిష్యత్ ఎంతో ఉండాల్సిన జీవితాలుఅర్ధాంతరంగా విమాన ప్రమాదంలో ముగిసి పోవడం చూసి ఆర్ద్రతతోనాలో నేననుకున్నాఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నది....!!
(అహమ్మదాబాద్ లో లండన్ వెళ్ళే బోయింగ్ విమానంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన చూసి ఆర్ద్రతతో వ్రాసినది)...........................
ఏ నిమిషానికి ఏమి జరుగునో:- కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి