పిల్లలను మొబైల్‌కు దూరంగా ఉంచాలి:- సి.హెచ్.ప్రతాప్
 ఈ సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి మనిషి జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. పెద్దలకే కాదు, ఇప్పుడు పిల్లలు కూడా మొబైల్ వాడకానికి అలవాటుపడుతున్నారు. అయితే, ఈ అలవాటు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిన్న వయస్సులోనే పిల్లలు గేమ్స్, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా వంటివి చూసే అలవాటుతో చదువుపై దృష్టి పోగొట్టుకుంటున్నారు.
మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల పిల్లల్లో దృష్టిదోషాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శారీరక చైతన్యం తగ్గిపోవటంతో పాటు, సహజ సామాజిక పరస్పర సంబంధాలు బలహీనపడతాయి. మాటలాడటం, భావప్రకటన, భావనలను పంచుకోవడం వంటి సామాజిక నైపుణ్యాలు తక్కువవుతాయి. ఇది వారిలో ఒంటరితనాన్ని పెంచే ప్రమాదం కలదు.
పిల్లలు ఎక్కువసేపు మొబైల్‌లో గడిపితే చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రత హరించబడుతుంది. పదే పదే నోటిఫికేషన్లు రావడం వల్ల గమనశక్తి దెబ్బతింటుంది. ముఖ్యంగా శిశువయసు నుంచి ప్రాధమిక పాఠశాల దశలోని పిల్లల మెదడు అభివృద్ధికి ఇది హానికరం. భవిష్యత్తులో వారు ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యంలో వెనుకబడే అవకాశముంది.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల జాగ్రత్తలు అత్యవసరం. మొబైల్ వినియోగాన్ని నియంత్రించాలి. పిల్లలకు ఆటలతో, పుస్తకాలతో, సంగీతంతో, ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలు కల్పించాలి. రోజువారీ క్రమానుసారంగా చదువుకి, ఆటకి, విశ్రాంతికి సమయాన్ని కేటాయించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులే మొదటగా మొబైల్ వినియోగంలో ఆదర్శంగా ఉండాలి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం