సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -903
"నైవాశ్రితేషు గుణ దోష విచారణా స్యాత్" న్యాయము
*****
నైవ అనగా ఎవరు కాదు. ఆశ్రితేషు అనగా ఆశ్రయం పొందిన వారు, ఆశ్రయం పొందిన వారిలో. గుణ అనగా లక్షణము, లక్షణము, అలవాటు.దోష అనగా తప్పు,లోపం, పొరపాటు. విచారణా అనగా వివరాలను తెలుసుకునే ప్రయత్నం, దర్యాప్తు వాకబృ, పరిశీలన, పరీక్ష,చర్చ.స్యాత్ అనగా అవకాశం ఉంది లేదా బహుశా అనే అర్థాలు ఉన్నాయి.
ఆశ్రితుల గుణ దోష విచారణ ఎవ్వరూ చేయరు.(చంద్రుడు దోషాకరుడైనా కుటిలుడయినా కళంకితుడయినా మిత్రుడు ( సూర్యుడు) అస్తమించిన తరువాత గాని తాను ఉదయించక పోయినా, శివుడు అతనిని తలమీద పెట్టుకున్నాడు). అనగా రక్షించమని వచ్చిన వాడు శరణు కోరిన వాడి గుణ దోషాలు ఎంచకుండా సజ్జనులు కాపాడుతారు లేదా రక్షిస్తారు అని అర్థము. 
 ఈ శ్లోకాన్ని మొత్తంగా చూద్దామా.
"దోషా కరోపి,కుటిలోపి,కళంకితోపి!/మిత్రాపసాన సమయే విహితోచ్ఛయోపి!చంద్రః,తథాపి,హర వల్లభతాం -ఉసైతి:/నైవాశ్రితేషు గుణ దోష నివారణా స్యాత్!!/
అనగా చంద్రుడు దోషాలకు నెలవు. రాత్రి చీకట్లోనే ఆయన తావు.చంద్రడు కుటిలుడు అనగా వంకర బుద్ధి గలవాడు. ( వంకరగా ఉంటాడు).ఈ విధంగా ఎన్నో పాపాలు చేసిన వాడు.మిత్రుడైన సూర్యుని అవసాన సమయంలో తాను వృద్ధి పొందుతాడు.అయినా శివుడికి అతని గుణ దోషాలు తెలిసిన శివుడు వాటన్నింటినీ తెలిసి కూడా అతడిని తలపై ధరించాడు అని అర్థం.
మరి దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణ కథను చూద్దామా..!
ప్రజాపతి దక్షుడికి మొత్తం 62 మంది కుమార్తెలు ఉండే వారని వారిలో 27 మంది( 27 నక్షత్రాలు- అశ్విని , భరణి, కృత్తిక, రోహిణి... మొదలైన)కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడని మత్స్య పురాణం చెబుతోంది.
అయితే చంద్రుడు తన 27మంది భార్యలలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించి మిగతా 26మంది భార్యలను నిర్లక్ష్యం చేస్తాడు.అది భరించలేని 26 మంది అక్కాచెల్లెళ్ళు తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటారు. అల్లుడి ఈ పక్షపాత ధోరణి నచ్చక దక్ష ప్రజాపతి కోపంతో చంద్రుడిని శాశ్వతంగా క్షీణించి పోవాలని శపిస్తాడు.
 శాపం వల్ల చంద్రుడు రాను రాను క్షీణించడం మొదలవుతుంది. బాగా బాధ పడుతూ ఉంటున్న సమయంలో నారదుడు చంద్రునితో " ఓ చంద్రుడా! దక్షుని శాపం నుండి నిన్ను రక్షించగలవాడు మహా దేవుడైన శివుడు మాత్రమే అని చెబుతాడు.
అప్పుడా చంద్రుడు. దక్షుడు శివుని భక్తుడు.అందులోనూ దక్షుని పనులలో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనని మాట ఇచ్చాడు.వరాలు శాపాలు అనుభవించక తప్పదు.వాటిని వెనక్కి తీసుకు రాలేము కదా! అంటాడు.
అప్పుడు నారదుడు చంద్రునితో "అది నిజమే కానీ నే చెప్పిన విధంగా ముందుగా నీవు శివుని వద్దకు వెళ్ళి శరణు కోరు.ఆ విధంగా శివుని వాగ్దానాన్ని పొందు.ఆ తర్వాత దక్షుడు పెట్టిన శాపం గురించి చెప్పు "అని తన ఆలోచనను చెబుతాడు నారదుడు.
 నారదుని సలహా ప్రకారం చంద్రుడు శివుని వద్దకు వెళ్ళి పాదాలపై బడి శరణు, ఆశ్రయం కోరుతూ తనను రక్షిస్తానని మాట ఇచ్చేంత వరకు లేవనని అంటాడు.
అసలే శివుడు భోళా శంకరుడు కదా! చంద్రుని  రక్షిస్తానని మాట ఇస్తాడు. ఎప్పుడైతే శివుడు రక్షిస్తానని మాట ఇచ్చాడో అప్పుడు తన శాపం గురించి చెబుతాడు. ఇచ్చిన మాట ప్రకారం ఏం చేయాలా అని శివుడు ఆలోచిస్తూ ఉంటాడు.
 దక్షుడికి విషయం తెలిసి హుటాహుటిన శివుని వద్దకు వచ్చి నా పనుల్లో జోక్యం చేసుకోనని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం భావ్యమా? అని నిలదీస్తాడు.
అప్పుడు ఆ శివుడు అతడు తప్పు చేశాడు నిజమే. నా ఆశ్రయం కోరి వచ్చిన వాడిని రక్షించకుండా ఎలా వదిలేస్తాను అనడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం మొదలవుతుంది.
అప్పుడు శ్రీమహావిష్ణువు వారి మధ్యలో జోక్యం చేసుకుని చంద్రుడిని రెండు సమాన భాగాలుగా చేస్తాను ఇందులో ఒక సగం దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ప్రకారం క్షీణించి పోతూ వుంటాడు.అలా చంద్రుడు నెమ్మదిగా క్షీణించి మళ్ళీ  పుంజుకుంటాడు అని. మిగిలిన సగం చంద్రుడిని శివుడు తలపై తన జుట్టులో పెట్టుకొని శాశ్వతమైన ఆశ్రయాన్ని కల్పిస్తాడు.ఈ విధంగా చంద్రుడు శివుడిని  శరణు కోరడం వల్ల రక్షింపబడతాడు.
 ఆశ్రయం కోరే వ్యక్తి ఎలాంటి వాడైనా శరణు అనడిగితే సజ్జనులు క్షమించి రక్షణ కల్పిస్తారనేది ఈ నైవాశ్రితేషు గుణ దోష నివారణా స్యాత్ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాము.
ఇలాంటి కథే గయోపాఖ్యానం. ఇందులో గయుడు ఆకాశయానం చేస్తూ వేసిన ఉమ్మి శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తూ నీటిని పట్టుకున్న దోసిట్లో పడటంతో ఆగ్రహించిన కృష్ణుడు అతనిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయడం.శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ తెలిసి భయపడుతూ ఉన్న గయుడికి నారదుడు సలహా ఇవ్వడం.ఆ సలహా ప్రకారం గయుడు వెళ్లి అర్జునుడి శరణు కోరడం.అభయం ఇచ్చిన తర్వాత అసలు విషయం చెప్పడం. ఆ తర్వాత కృష్ణార్జునుల మధ్య ఘోర యుద్ధం మొదలవ్వడం. శివుడు వారిద్దరినీ శాంతింప జేయడం.శ్రీకృష్ణుడు గయుని క్షమించి వదిలివేయడం జరుగుతుంది.
 కాబట్టి ఎటువంటి వారైనా ప్రాణ భయంతో రక్షించమని ఆశ్రయం కోరితే వారిని రక్షించాలని ఈ న్యాయము చెబుతోంది.
 అయితే దుష్టుడినీ, దుర్మార్గుడిని రక్షిస్తే లోకానికి మంచిది కాదు కదా! కాబట్టి అలా ఎవరైనా వస్తే పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు. అక్కడ జరిగింది లోక హితం కోసం నారదుడు చేసిన చక్కని ఆలోచన. మరి ఇప్పుడు అలాంటి వారిని పోనిలే అని వదిలేస్తే అనర్థాలే ఎక్కువగా జరుగుతాయి.కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది అనేది కూడా మనం గ్రహించాల్సి వుంది.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం