ఆలూరులో గద్వాల సోమన్న శాంతి కపోతం పుస్తకావిష్కరణ

 నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న 72వ పుస్తకం"శాంతి కపోతం" పుస్తకావిష్కరణ సోమనాథ ప్రేమ మందిరం,రాధాస్వామి ఆశ్రమం ప్రాంగము,ఆలూరు,కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగింది.ప్రముఖ రచయిత్రి,విశ్రాంత మండల విద్యాధికారిణి హత్తిబెళగల్లు రామలింగమ్మ,కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల హిందీ అధ్యాపకురాలు శ్రీమతి యం.పార్వతి,విశ్రాంత డి.ఎస్పీ శ్రీ రంగముని,విశ్రాంత డి.పి.ఓ.శ్రీనివాసులు,శ్రీ వీరస్వామి మరియు విచ్చేసిన ప్రముల చేతుల మీద శాంతి కపోతం పుస్తకావిష్కరణ చేశారు.దీనితో పాటు హత్తిబెళగల్లు రామలింగమ్మ గారి "నా జీవన పథంలో.." పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం కృతికర్త గద్వాల సోమన్న వారి విశేష కృషి గాను సత్కరించారు.ఈ కార్యక్రమంలోపద్య కవి ఈశ్వరప్ప, విశ్రాంత గ్రంథాలయ అధికారి శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లు, స్థానిక గ్రంథాలయ అధికారి శ్రీ విజయ భాస్కర్, సభ సమన్వయకర్త శ్రీమతి మహాదేవి,శ్రీమతి నాగజ్యోతి,అడ్వకేట్ శ్రీ భాస్కరగౌడ్.. మొదలగు వారు పాల్గొన్నారు. అనతి కాల వ్యవధి లో 72 పుస్తకాలు వ్రాసి,ముద్రించిన సోమన్నను నాగలదిన్నె ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎ. జాన్సన్ గారు,తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం