సాహితీ కవి కళా పీఠం.సాహితీ కెరటాలు=============ఎరుపెక్కిన ఎర్రని సూరీడులా,కణకణ మండుతున్న ఎర్రని చింత నిప్పుల్లా ,ఎగిసిపడే లావాలా,"నా రక్తం" మండుతోంది.అందనంత ఎత్తులో; అరాచకత్వాలు.ఆకాశాన్ని అందుకోవాలనే;అమానవీయాలు.ఎవరెస్ట్ ను చేరాలనే; దుర్మార్గాలు.మేఘాలను ముట్టుకోవాలనే; అన్యాయాలు.నాకళ్ళను, ఎరుపెక్కిస్తున్నాయి.మద మత్తులో- విలాసవంతులు,స్వార్థమత్తులో- నాయకులు,పట్టిన బూజులో- వ్యవస్థలు,తప్పిన గతిలో- మానవత్వాలు,నా హృదయానికి తాకే బాణాలవి.నా నినాదం ఒక్కటే"అశాంతి సంహారం"నా లక్ష్య సాధనకు,చూపుల్లో- హావం.హవంలో- రౌద్రం.రౌద్రంలో -భావం.ఎగిసే జువ్వల్లా , ప్రతిబంబిస్తా.ఎత్తే చేతులు "పిడికిలిలై"ఉరగాంగణ లాదుష్ట సంహారం చేసి"విజయ పరంపరతో"వేదనిలయ మాతృభూమికిఅంకితమిస్తా.
:"అశాంతి సంహారం":- బెహరా నాగభూషణరావు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి