4000 కవితలు వ్రాసిన పోలయ్య కవి కూకట్లపల్లికి "ఒకే రోజు రెండు" సన్మానాలు
 శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  ఆదివారం జరిగిన రెండు "పుస్తకావిష్కరణ" సభలకు కళారత్నడాక్టర్ బిక్కికృష్ణ అధ్యక్షత వహించగా...కవి సమ్మేళనాలకు డాక్టర్ రాధ కుసుమ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఉదయం...విమల సాహితీ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు డాక్టర్ జల్దీ విద్యాధర్ వ్రాసిన "విహంగ వీక్షణం" వ్యాస సంపుటిని 
ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు...
ఈ సభలో కవి సమ్మేళనంలో పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని..."ఎగరలేని పక్షి...ఎదగలేని 
మొక్క"...అను శీర్షికతో కవితా గానం చేశారు.
సాయంకాలం...విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్ మరియు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గజల్ 
రచయిత్రి విజయలక్ష్మి పండిట్ వ్రాసిన 
"హిందీ గజల్ అనువాద పుస్తకాన్ని" ముఖ్య
అతిథి పూర్వ ఇన్కమ్ టాక్స్ కమిషనర్
ఎం. నరసింహప్ప...ఆవిష్కరించారు.
ఈ సభలో కవిసమ్మేళనంలో పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని"అందమెక్కడున్నది" ?
శీర్షికతో  "అన్న నందమూరి" పై కవితా
గానం చేసి అందరినీ అలరించారు
ఈ రెండు సభల్లో అనేక మంది కవులను కవయిత్రులను సామాజిక కార్యకర్తలను కళాకారులను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా పోలయ్య కవి కూకట్లపల్లి మాట్లాడుతూ ఈ రెండు సభల్లో తాను 
"కవితా గానం" చేసినందుకు...దాదాపుగా
4000 లకు పైగా కవితలు వ్రాసినందుకు..
గుర్తింపుగా...కళారత్న డాక్టర్ బిక్కికృష్ణ...
డాక్టర్ జల్దీ విద్యాధర్...ఎం. నరసింహప్ప..
డాక్టర్ విజయలక్ష్మి పండిట్...డాక్టర్ మునగా రామ్మోహన్ రావు...మువ్వా శ్రీనివాసరావు తదితర సాహితీమూర్తులు పోలయ్య కవి కూకట్లపల్లిని ఘనంగా సత్కరించారు...
అందుకు ప్రతి ఒక్కరికీ పోలయ్య కవి 
కూకట్లపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు...
ఈ రెండు సభలకు భగీరథ...మౌనశ్రీ మల్లిక్...సురారంశంకరం...వెంకటదాసు..
సరికొండ నరసింహ రాజు... శైలజా మిత్ర...
కవులు కవయిత్రులు...విమల సాహితీ సమితి సభ్యులు...హాజరయ్యారు. మధ్యాహ్నం 
డా.జల్ధీ విధ్యాధర్ "కమ్మని విందును" ఏర్పాటు చేశారు...ఈ రెండు సాహితీ సభలు కవులకు 
మరిచిపోలేని ఒక తీపిజ్ఞాపకమే.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం