గురు పూర్ణిమ:- సి. హెచ్. అనసూయ-హైదరాబాద్
సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు 
================
వ్యాసాయ, విష్ణు రూపాయ.
వ్యాస రూపాయ, విష్ణవే.

వ్యాసుని,స్మరించుకుంటూ,
గురు పౌర్ణమి,జరుపుకుంటాము.

ఇది, సనాతన సంప్రదాయం,
అజ్ఞాన, అంధకారాన్ని పారత్రోలే, వాడే సద్గురువు.

శ్రీకృష్ణం, వందే, జగద్గురుమ్.
గురువు లేని విద్య,గుడ్డి విద్య

వ్యాసుడి వల్లే,మహాభారతం,
ఆరంభం,అయింది,వ్రాయ బడింది.

జగద్గురు, ఆది శంకరులు, అద్వయితాన్ని
స్థాపించి, ఎన్నో,ఆమ్నాయ పీఠములు స్థాపించి, సనాతన
ధర్మాన్ని నిలబెట్టారు.

కంచి పీఠాధిపతులు, శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర
సరస్వతీ,మహా స్వామి వారు
నడిచే దేవుడు,అని పేరు.

హయగ్రీవుడు, దక్షిణామూర్తి, దత్తా త్రేయుడు, షిరిడి సాయిబాబా, అక్కల్ కోట స్వామి, ఎందరో సిద్ధఆశ్రమ యోగులను, స్మరించుకుంటూ, ఈరోజు గురు పౌర్ణమి,జరుపు కుంటాము.

హిందూ ధర్మాన్ని,నిలబెట్టటానికి,
పాపం పెరిగినప్పుడు,ఈ భూమి
మీద అవతరించిన, మహానుభావులు, దేవతామూర్తులు,సద్గురువులు,
నడయాడిన,పవిత్ర భూమి, కర్మ భూమి
మన భారత దేశం.

మన మహర్షులు,అందరికి ప్రణామములు, చెప్పాలి.
గురువు కోపిస్తే, ఏ దేవుడు కుడా రక్షించలేడు,
బృహస్పతి కోపానికి గురి అయిన,ఇంద్రుడే,రాజ్య భ్రష్ఠుడు అయ్యాడు.

ఏకలవ్యుడు, గురువు లేక,విద్య రాణించ లేదు, ఇలా మన పురాణాల్లో,ఎన్నో సంఘటనలు.

ఈరోజు, గురువుని,స్మరించుకుని,
సనాతన ధర్మాన్ని, నిలబెడదాము.
భావి తరాలకు,హిందూ ధర్మం
ఏమిటో, ఏలుగెత్తి చాటుదాం.



కామెంట్‌లు