అలీ అసామాన్యడు:- - యామిజాల జగదీశ్
 “అలీ సహజ ప్రతిభ కలిగిన గొప్ప వ్యక్తి. నేను లేకుండానే అతను గొప్ప ఛాంపియన్ అయ్యేవాడు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. నేను ఓ విషయం గట్టిగా చెప్పగలను. అతను బాక్సింగ్ రింగ్ వెలుపల నాకు నేర్పినవి ఓపిక, మర్యాద. ఎదుటివారితో ఎలా మెలగాలనేది అతని నుంచే నేర్చుకున్నాను..." 
ఈ మాటలు ఎవరివో కావు. 
ఏంజెలో డుండీ (ఆగస్టు 30, 1921 - ఫిబ్రవరి 1, 2012) అనే అమెరికన్ బాక్సింగ్ మేనేజర్, బాక్సింగ్ ప్రమోటర్ , బాక్సింగ్ ట్రైనర్. కార్నర్‌ మ్యాన్. అలనాటి ప్రముఖ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ ముహమ్మద్ అలీ (1960–1981)తో కలిసి పని చేసిన క్రమంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తే ఈ ఏంజెలో డుండీ. ఆయన, షుగర్ రే లియోనార్డ్ , సీన్ మానియన్ , జోస్ నేపోల్స్ , జార్జ్ ఫోర్‌మాన్ , జార్జ్ స్కాట్ , జిమ్మీ ఎల్లిస్, కార్మెన్ బాసిలియో , లూయిస్ మాన్యుయెల్ రోడ్రిగ్జ్, విల్లీ పాస్ట్రానోలతో సహా 15 మంది ఇతర ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లతోనూ పని చేశారు.
“అలీ ప్రతిదానికీ ఎలా స్పందిస్తాడో నేను దగ్గరుండీ చూశాను. అతనికి జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఆందోళనపరిచాయి. అయినా అతనెలా స్థిమితంగా నిలకడగా ఉంటాడో ఆశ్చర్యం కలిగించేది. అతను చెప్పేదంతా 'ఎవరినైనాసరే నువ్వు  క్షమించాలి' అని మాత్రమే."
ఏంజెలో డుండీ గొప్పవాడికి శిక్షణ ఇచ్చి ఉండవచ్చు కానీ అతను ఎప్పుడూ అతన్ని సృష్టించానని చెప్పుకోలేదు. వాస్తవానికి, అతను అలీని పంచ్‌లు లేదా ఫుట్‌వర్కుతో కాదు, దయతో ఆకృతి చేసిన వ్యక్తిగా అభివర్ణిస్తాడు. చేదు అనుభవాలు చవిచూసినాసరే అలీ ద్వేషంతో మెలిగే వాడు కాదు....క్షమాపణతో స్పందించే వాడు. చివరికి, బాక్సింగ్ రింగ్‌లోని పోరాట యోధుడు నాకు రింగుకివతల గురువయ్యాడు. అతను జీవితాంతం నాకు బోధించిన పాఠం మరువలేనిది అని ఏంజెలో నుండీ చెప్పాడు.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం