తంగి సన్యాసరావు : - డా సి..వసుంధర చెన్నై.
 ఈనాటి ఆణిముత్యమురాసిన కవిగారు, 
తంగి సన్యాసరావు 
మొదటివాక్యంలోనే
తెలుగును వారధితో
పోల్చి తెలుగుభాషా
వైభవాన్నీ,విశేష గుణ
లక్షణాలను 
స్పురింప చేశారు.వారికి ముందుగా అభినందనలు నమస్సులు.
సముద్ర జలాలను అక్షరాలుగా ఊహించి అవి  నీలాంబరమున మెఘాలై అనిచెప్పడంలో  కాళిదాస మహాకవి మేఘ(దూతం)సందేశం
మనమనస్సులో తళుక్కుమంటున్నది.
అంతేకాక  మన తెలుగు కాళిదాసు గారు (ఇంకేం బిరుదులు ఉన్నాయో నాకు తెలియదు),అదేనండి! దేవులపల్లికృష్ణశాస్త్రి గారి
"ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవో.." అనే మల్లేశ్వరి లోని పాట వెంటనే జ్ఞాపకం రావడం తథ్యం.

తెలుగు భాషా
సింధువులోని భావ జలాలు అమృతాక్షరబిందువులై కవులహృదయాకాశ వీధిలో కవిత్వపు 
స్వాతి చినుకులై
భువికేతించి ఆంధ్ర సారస్వత పరిషత్  ఆల్చిప్పగా స్వాగతింప ఆణిముత్యాలుగా అనునిత్యం "జ్యోతి"
వెలుగులో ఉల్లములు ఝల్లుమనంగా  సాక్షాత్కరించుచు న్నవి, చదివి తరింతుము రండు తెలుగు తల్లి చరిత్ర. 
చెప్పతరమా! 
ఆ తల్లి చేతి తియ్యని కావ్యరుచులు. అందుకే  తెలుగు ఆణిముత్యములు అనంతములై వర్ధిల్లు గాక.
తంగి సన్యాసరావు గారికి మరొక మారు 
అభినందనలు. 
డా సి..వసుంధర చెన్నై.4/7/25

కామెంట్‌లు