జాతీయ సదస్సు విజయవంతం

 హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  శనివారం  “హంతక రోబోలను నిలిపివేద్దాం – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయుధాల నియంత్రణ” అనే అంశంపై జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు .
  ఈ సదస్సును భారత శాంతి, నిరాయుధీకరణ మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ (Indian Institute for Peace Disarmament and Environmental Protection – IIPDEP) మరియు నవభారత నిర్మాణ సంఘం సంయుక్తంగా నిర్వహించాయి.
సదస్సులో ముఖ్య అతిథిగా డా. రియాజ్ అలీ, చైర్మన్ – రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం పాల్గొని, శాంతి పరిరక్షణలో సాంకేతికతను మానవ విలువలకు అనుగుణంగా వినియోగించుకోవాలంటూ విలువైన సందేశాన్ని అందించారు.
ప్రధాన ఉపన్యాసకుడిగా మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాసరావు ప్రసంగిస్తూ, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆయుధాలు మానవ సమాజంపై కలిగించే ప్రభావాలను విశ్లేషించారు.
డా. బాలకృష్ణ కురవే, ప్రెసిడెంట్ – IIPDEP, సదస్సుకు అధ్యక్షత వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆయుధ నియంత్రణపై కొనసాగుతున్న ఉద్యమాల గురించి వివరించారు.
కార్యక్రమానికి నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు  సూరేపల్లి రవికుమార్, మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం శాంతి భావజాలం అవసరమని పేర్కొన్నారు.
ఈ సదస్సులో కే. శంకర్‌రావు, పద్మిని సింగ్, అశోక్, రాజా, సునీల్, రాజేష్, ఉపేంద్ర గుప్తా, అరుణ జ్యోతి తదితరులు పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రజలు, విద్యార్థులు, శాంతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆయుధాలు మానవాళికి సవాలు విసురుతున్న నేపథ్యంలో ఈ సదస్సు ఆలోచనాత్మక చర్చలకు వేదికగా నిలిచింది.
కామెంట్‌లు