భీష్ముని జన్మవృత్తాంతం
గంగా నది ఒడ్డున ఒక అందమైన స్త్రీని చూచిన హస్తినాపుర మహారాజు శంతనుడు
పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి ఆశ్వమేధ యాగాలూ నూరు రాజసూయ యాగాలూ చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమెచీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమెవంక ఆసక్తిగా చూసాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్ధించాడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. తనవంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై
మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న ఆష్ట వశువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది. దానికి సమాధానంగా వారు " వశిష్ట మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు " అని వేడుకున్నారు. వశువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్గాయువౌతాడని అది వశిష్ట శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒక రోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడితొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మ వాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు. శంతనుడు గంగాతీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన ఏడుగురు వశువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిభంధలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు దీర్గాయుష్మంతుడని అతనికి విద్యాబుద్దులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యాపారంగతుడూ మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది.
అష్టవశువుల వృత్తాంతం
గంగాదేవి శంతనుని విడిచి వెళ్ళే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు.సమాధానంగా గంగాదేవి "మహారాజా వరుణుడి కుమారుడు వశిష్టుడు.అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకుని తపమాచరిస్తున్నాడు.నందిని అనే కామదేనువు వశిష్టుడికి కావలసిన సమస్త వస్తువులూ సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది.ముని వద్దకు వచ్చిన అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు తీసి ఇస్తే దానిని తన
దేవవ్రతుని శంతనునికి అప్పగిస్తున్న గంగా దేవి
స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది.మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆధేనువును వశిష్టుడి నుండి పట్టుకుని వెళ్ళడానికి తోడ్పడ్డారు.యోగదృష్టితో ఇది గ్రహించిన వశిష్టుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు.వసువులు తప్పు గ్రహించి వశిష్టుని కాళ్ళ మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. వశిష్టుడు అలాగే జరుగుతుంది కానీ ఎనిమిదవ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతాన హీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు." అని శంతన మహారాజుకు చెప్పి ఎనిమిదవ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతనుని విడిచి వెళ్ళింది.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
గంగా నది ఒడ్డున ఒక అందమైన స్త్రీని చూచిన హస్తినాపుర మహారాజు శంతనుడు
పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి ఆశ్వమేధ యాగాలూ నూరు రాజసూయ యాగాలూ చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమెచీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమెవంక ఆసక్తిగా చూసాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్ధించాడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. తనవంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై
మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న ఆష్ట వశువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది. దానికి సమాధానంగా వారు " వశిష్ట మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు " అని వేడుకున్నారు. వశువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్గాయువౌతాడని అది వశిష్ట శాపమని కోరుకున్నారు. గంగాదేవి వారి కోరికను మన్నించింది. గంగాదేవి ఒక రోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడితొడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది. పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు. బ్రహ్మ వాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు. శంతనుడు గంగాతీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు. ముందుగా పుట్టిన ఏడుగురు వశువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిభంధలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు దీర్గాయుష్మంతుడని అతనికి విద్యాబుద్దులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది. చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వవిద్యాపారంగతుడూ మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది.
అష్టవశువుల వృత్తాంతం
గంగాదేవి శంతనుని విడిచి వెళ్ళే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు.సమాధానంగా గంగాదేవి "మహారాజా వరుణుడి కుమారుడు వశిష్టుడు.అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకుని తపమాచరిస్తున్నాడు.నందిని అనే కామదేనువు వశిష్టుడికి కావలసిన సమస్త వస్తువులూ సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది.ముని వద్దకు వచ్చిన అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకు తీసి ఇస్తే దానిని తన
దేవవ్రతుని శంతనునికి అప్పగిస్తున్న గంగా దేవి
స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది.మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడి ఆధేనువును వశిష్టుడి నుండి పట్టుకుని వెళ్ళడానికి తోడ్పడ్డారు.యోగదృష్టితో ఇది గ్రహించిన వశిష్టుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు.వసువులు తప్పు గ్రహించి వశిష్టుని కాళ్ళ మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. వశిష్టుడు అలాగే జరుగుతుంది కానీ ఎనిమిదవ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతాన హీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు." అని శంతన మహారాజుకు చెప్పి ఎనిమిదవ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది. ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతనుని విడిచి వెళ్ళింది.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి