భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 258 వ రోజు
శ్రుతాయువుపై ధర్మరాజు విజయం
యుధిష్టరుడు శ్రుతాయువు మీద తొమ్మిది శమములు ప్రయోగించాడు. శ్రుతాయువు వాటిని త్రుంచి వేసి ఏడు బాణాలు యుధిష్టరుని మీద వేసాడు. యుధిష్టరుడు కోపించి వరాహముఖాన్ని కర్ణమును పోలిన నారాచబాణాన్ని ప్రయోగించి శ్రుతాయువు వక్షస్తలాన్ని చీల్చాడు. మరొక బాణముతో అతని కేతనమును విరిచాడు. శ్రుతాయువు ఏడు బాణములు ప్రయోగించి ధర్మరాజును బాధించాడు. ధర్మరాజు మహోగ్రుడై శ్రుతాయువు రథముకు కట్టిన గుర్రములను చంపి, విల్లు విరిచి, కేతనమును విరిచి, అతని శరీరాన్ని రక్తసిక్తం చేసాడు. శ్రుతాయువు బెదిరి పారిపోయాడు. అది చూసిన కౌరవసేన కకావికలై పోగా పాండవ సేనలు జయధ్వానాలు చేసారు. కృపాచార్యుడు చేకితానుడితో పోరుతున్నాడు. చేకితానుడు కృపాచార్యునిపై నిశిత బాణములు ప్రయోగించగా, కృపాచార్యుడు చేకితానుని రథాశ్వములను చంపాడు. చేకితానుడు గదాయుధంతో కృపాచార్యుని రథం విరుగకొట్టి, రథముకు కట్టిన హయములను చంపాడు. కృపాచార్యుడు చేకితానుని పదహారు నిశిత బాణములతో కొట్టాడు. చేకితానుడు కృపాచార్యునిపై గదను విసిరాడు. కృపాచార్యుడు ఆ గదను మధ్యలో త్రుంచి వేసాడు చేకితానుడు రథము దిగి వాడి అయిన ఖ్డ్గం తీసుకున్నాడు. అది చూసిన కృపాచార్యుడు ఖడ్గం తీసుకుని చేకితానునిపై కలియపడ్డాడు. ఒకరికొకరు గాయపరచుకుని ఇరువురు మూర్చిల్లాడు. అది చూసి కౌరవ సేన నుండి శకుని కృపాచార్యుని, పాండవ సేన నుండి కరకర్షణుడు వచ్చి చేకితానుడిని రథముల మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు. ధృష్టకేతు భూరిశ్రవునితో ఘోరయుద్ధం సాగిస్తున్నాడు. ధృష్టకేతు భూరిశ్రవునిపై తొమ్మిది బాణములు వేసాడు. భూరిశ్రవనుడు కోపించి ధృష్టకేతుని రథాశ్వములను చంపి అతడిపై కరకుటమ్ములు ప్రయోగించాడు. అలసి పోయిన ధృష్టకేతు శతానీకుని రథముపై ఎక్కి అవతలకు వెళ్ళాడు. అభిమన్యునికి వికర్ణ, చిత్రసేన, దుశ్శాసనుల మధ్య భయంకర పోరు సాగుతుంది. అభిమన్యుడు వారందరి రథములను విరుగకొట్టి వారిని చంపకుండా భీమసేనుని శపథం గుర్తుకు వచ్చి విడిచి పెట్టాడు. ఇది గమనించిన భీష్ముడు దుశ్శాసనునికి సాయంగా వచ్చాడు. ఒంటరిగా ఉన్న అభిమన్యునికి తోడుగా అర్జునుడు తన రథముతో అక్కడకు వచ్చాడు. త్రిగర్తాధిపతి అర్జునిని అడ్డగించి ఎదుర్కొన్నాడు. అర్జునుడు " మీరు కౌరవ సేనలో మేటి వీరులని విన్నాను భయము వదిలి నాతో యుధం చెయ్యి " అని అతనిపై శరవర్షం కురిపించాడు. అది గమనించిన కురు సైన్యం ఒక్క పెట్టున అర్జునిపై పడింది. పాండవ సైన్యం అర్జునునికి సాయంగా వచ్చాయి. పోరు ఘోరమైంది. అర్జునుడు తన నిశిత శరాఘాతముతో కౌరవ వీరుల రథముకు కట్టిన హయములను చంపుతూ, రథములను విరుగ కొడుతూ, కేతనములు విరుస్తూ, విల్లులను విరుస్తూ యుద్ధరంగమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
శ్రుతాయువుపై ధర్మరాజు విజయం
యుధిష్టరుడు శ్రుతాయువు మీద తొమ్మిది శమములు ప్రయోగించాడు. శ్రుతాయువు వాటిని త్రుంచి వేసి ఏడు బాణాలు యుధిష్టరుని మీద వేసాడు. యుధిష్టరుడు కోపించి వరాహముఖాన్ని కర్ణమును పోలిన నారాచబాణాన్ని ప్రయోగించి శ్రుతాయువు వక్షస్తలాన్ని చీల్చాడు. మరొక బాణముతో అతని కేతనమును విరిచాడు. శ్రుతాయువు ఏడు బాణములు ప్రయోగించి ధర్మరాజును బాధించాడు. ధర్మరాజు మహోగ్రుడై శ్రుతాయువు రథముకు కట్టిన గుర్రములను చంపి, విల్లు విరిచి, కేతనమును విరిచి, అతని శరీరాన్ని రక్తసిక్తం చేసాడు. శ్రుతాయువు బెదిరి పారిపోయాడు. అది చూసిన కౌరవసేన కకావికలై పోగా పాండవ సేనలు జయధ్వానాలు చేసారు. కృపాచార్యుడు చేకితానుడితో పోరుతున్నాడు. చేకితానుడు కృపాచార్యునిపై నిశిత బాణములు ప్రయోగించగా, కృపాచార్యుడు చేకితానుని రథాశ్వములను చంపాడు. చేకితానుడు గదాయుధంతో కృపాచార్యుని రథం విరుగకొట్టి, రథముకు కట్టిన హయములను చంపాడు. కృపాచార్యుడు చేకితానుని పదహారు నిశిత బాణములతో కొట్టాడు. చేకితానుడు కృపాచార్యునిపై గదను విసిరాడు. కృపాచార్యుడు ఆ గదను మధ్యలో త్రుంచి వేసాడు చేకితానుడు రథము దిగి వాడి అయిన ఖ్డ్గం తీసుకున్నాడు. అది చూసిన కృపాచార్యుడు ఖడ్గం తీసుకుని చేకితానునిపై కలియపడ్డాడు. ఒకరికొకరు గాయపరచుకుని ఇరువురు మూర్చిల్లాడు. అది చూసి కౌరవ సేన నుండి శకుని కృపాచార్యుని, పాండవ సేన నుండి కరకర్షణుడు వచ్చి చేకితానుడిని రథముల మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళారు. ధృష్టకేతు భూరిశ్రవునితో ఘోరయుద్ధం సాగిస్తున్నాడు. ధృష్టకేతు భూరిశ్రవునిపై తొమ్మిది బాణములు వేసాడు. భూరిశ్రవనుడు కోపించి ధృష్టకేతుని రథాశ్వములను చంపి అతడిపై కరకుటమ్ములు ప్రయోగించాడు. అలసి పోయిన ధృష్టకేతు శతానీకుని రథముపై ఎక్కి అవతలకు వెళ్ళాడు. అభిమన్యునికి వికర్ణ, చిత్రసేన, దుశ్శాసనుల మధ్య భయంకర పోరు సాగుతుంది. అభిమన్యుడు వారందరి రథములను విరుగకొట్టి వారిని చంపకుండా భీమసేనుని శపథం గుర్తుకు వచ్చి విడిచి పెట్టాడు. ఇది గమనించిన భీష్ముడు దుశ్శాసనునికి సాయంగా వచ్చాడు. ఒంటరిగా ఉన్న అభిమన్యునికి తోడుగా అర్జునుడు తన రథముతో అక్కడకు వచ్చాడు. త్రిగర్తాధిపతి అర్జునిని అడ్డగించి ఎదుర్కొన్నాడు. అర్జునుడు " మీరు కౌరవ సేనలో మేటి వీరులని విన్నాను భయము వదిలి నాతో యుధం చెయ్యి " అని అతనిపై శరవర్షం కురిపించాడు. అది గమనించిన కురు సైన్యం ఒక్క పెట్టున అర్జునిపై పడింది. పాండవ సైన్యం అర్జునునికి సాయంగా వచ్చాయి. పోరు ఘోరమైంది. అర్జునుడు తన నిశిత శరాఘాతముతో కౌరవ వీరుల రథముకు కట్టిన హయములను చంపుతూ, రథములను విరుగ కొడుతూ, కేతనములు విరుస్తూ, విల్లులను విరుస్తూ యుద్ధరంగమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి