సగరుని యజ్ఞము - యజ్ఞేశ్వమును వెదకుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
గురువులతో ఋత్విజులతో సగరుడు 
యజ్ఞ కార్యమును ఆరంభించెను 
రాముడు ఆ యజ్ఞం గూర్చి తెలుపమంటాడు 
ముని యజ్ఞాశ్వము గూర్చి తెలుపుతాడు 

హిమవంతుడను పర్వత రాజు 
రామ వినుము మహాదేవునికి మామ 
హిమ పర్వతమునకు వింధ్య పర్వతమునకు 
మధ్యన ఎత్తైన గిరులుఏవి యుండవు 

ఆ పర్వతాలు ఎదురెదురుగానుంటాయి 
ఆ రెండు పర్వతాల మధ్య యజ్ఞమాచరించారు 
ఆ ప్రదేశము యజ్ఞ కర్మలకు అనువైనది 
సగరరాజు గొప్ప అంశమంతుడు 

ఇంద్రుడు మాయా శరీరముతో వచ్చి
సగరుడు ఆచరించే ఆ యజ్ఞమునుండి 
ఆ మహారాజుకు తెలియకుండానే 
ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించినాడు

ఋత్విజులు యజ్ఞ అపహరణ గూర్చి 
సగరునికి ఈ విధముగా తెలుపుతారు
కకుత్ స్థవంశమునకు చెందిన యజ్ఞాశ్వానికి
యజ్ఞభంగం జరిగిటవలన అరిష్టము ప్రాప్తించును 


కామెంట్‌లు