సగరుడు తన ఆరువైమంది పుత్రులను పిలిచి
ఆ అశ్వం గూర్చి వెతకమని ఆజ్ఞాపించాడు
తండ్రి మాటలు విన్న ఆ పుత్రులు
భూమండలమంతా తిరిగినారు
ఎక్కడ కూడా ఆ గుర్రం జాడ తెలియలేదు
వారు కోపగించి భూమిని లోతుగా తవ్వారు
భూమిలో నుండి నాగుల, రాక్షసుల ధ్వనులు
వారికి చెవులారా వినబడుచుండెను
ఆ రాకుమారులు పర్వతాలతో నిండియున్న
జంబుద్వీపమును వదలకుండా
లోతుగా తవ్వి సంచరించుచున్నారు
దేవతలు గంధర్వులు భీతి చెందినారు
నాగులు దేవతలు భయముతో
బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు
పాతాళ లోకమున ఎందరో హతులవుతున్నారు
ఓ పితామహ మమ్మల్ని ఆదుకోవయ్యా
సగర కుమారుల కంటపడిన వారిని
అశ్వము దొంగలించారని హతమారుస్తున్నారు
ఎందరో అమాయకులు బలి అవుతున్నారు
మీ శక్తితో కాపాడుమని మొరపెట్టుకున్నారు

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి