భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 277 వ రోజు
కర్ణుడు భీష్ముని కలుసుకొనుట
ఆ సమయమున కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వెళ్ళి భక్తితో పాదములకు నమస్కరించి " పితామహా! నా మీద కోపము మాని వాత్సల్యం చూపి నాకు తగిన చల్లటి మాటలాడండి " అని ప్రార్థించాడు. భీష్ముడు కర్ణుని ప్రేమతో దగ్గరకు పిలిచి ఒక చేయి ఎత్తి కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను వెళ్ళమని చెప్పి తమ మాటలు ఎవరూ వినలేదని దృఢపరచుకుని " కర్ణా ! నీ మీద కోపము నా కెందుకయ్యా ! నీవు కుల భేదముతో మాట్లాడుతున్నావని కురు పాండవుల మధ్య వైరము ఎగత్రోయుచున్నావని నిన్ను నిందించానే కాని నాకు నీపై ఎలాంటి ప్రత్యేక కోపం లేదు. అది పెద్ద వాడిగా నేను నీకు వేసిన శిక్షే కాని ద్వేషం చూపుట కాదు. నీ పుట్టుక దైవీకము. అందు వలన నిన్ను గెలుచుట సాధారణ మానవులకు అసాధ్యము. నీవు కుంతీ పుత్రుడవు కానీ రాధేయుడవు కాదు. ఈ విషయం నేను వ్యాసుడు ఏకాంతంగా చెప్పగా విన్నాను. నాకు నీ పరాక్రమము తెలియును నీవు పాండు పుత్రుడవు కనుక నీ యందు నాకు వాత్సల్యం ఉన్నది. నేను సుయోధనునికి పాండవులతో వైరము తగదు దైవాంశ సంభూతులైన వారిని జయించుట అసాధ్యం అదియును కాక సాక్షాత్తు నారాయణుడు అయిన శ్రీకృష్ణుని అండ వారికి ఉంది అని చెప్పాను . అతడు అది లక్ష్యపెట్ట లేదు. నీవు కూడా నీ తలపు మానుకుని పాండవులతో స్నేహంగా ఉండు " అని హితవు పలికాడు. అందుకు కర్ణుడు " పితామహా ! నేను కౌంతేయుడినని రాధేయుడను కానని నాకు ఇంతకు మునుపే తెలిసింది. పాండవులు మహాబలులు వారికి శ్రీకృష్ణుని అండ ఉన్నది. వారిని జయించుట కుదరని పని ఇది తధ్యము. కాని నాకు ఇప్పుడు కుంతీ పుత్రులతో పొత్తు ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు. నేను ఇప్పటి వరకు సుయోధనుని ప్రాపున మన్ననలంది విపత్కర సమయమున అతడిని విడుచుట న్యాయమా, ధర్మమా? కృతఘ్నుడనని లోకం నన్ను నిందించదా? నన్ను పిరికి వాడని నిందించదా ! అది కాక పాండవులకు నేను అనేక విధముల కీడు చేసాను. కురుసభలో పాండవులను పెక్కు విధముల అవమానపరిచాను. ద్రౌపదిని నీచంగా మాట్లాడాను. వారికి నేనంటే అసహ్యము పుట్టేలా ప్రవర్తించాను. అహర్నిశలు వారికి కీడు తలపెట్టాను. కౌరవులకు పాండవులకు మధ్య వైరము రగిల్చి పెంచి పోషించాను. ఈ సమయంలో నాకు వారితో యుద్ధమే కాని పొత్తు సాధ్యం కాదు. నన్ను నమ్మిన సుయోధనుని వంచించలేను. జయాపజయములు దైవాధీనము. నాకు పాండవులతో యుద్ధమే శరణ్యం. నా సేవాధర్మం నెరవేర్చేలా నన్ను దీవించండి. నా పరాక్రమం కృష్ణార్జునులకు చూపించే తరుణం ఆసన్నమైంది " అని పలికాడు కర్ణుడు. భీష్ముడు " కర్ణా ! నీవు అంతటి పరాక్రమశాలివి అనినాకు తెలియును. సుయోధనునికి నీ బుజబలమే సహాయకారి. రారాజుకు ప్రియం కలిగేలా ప్రవర్తించుటకు నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను " అని పలికాడు. భీష్ముని ఆదర పూర్వకమైన పలుకులు విని ఆనందించిన మనసుతో కర్ణుడు తన నివాసముకు వెళ్ళాడు " అని పలికి సంజయుడు పది రోజుల యుద్ధవిశేషాలు చెప్పడం ముగించాడు.
*భీష్మ పర్వము తృతీయాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కర్ణుడు భీష్ముని కలుసుకొనుట
ఆ సమయమున కర్ణుడు ఒంటరిగా భీష్ముని వద్దకు వెళ్ళి భక్తితో పాదములకు నమస్కరించి " పితామహా! నా మీద కోపము మాని వాత్సల్యం చూపి నాకు తగిన చల్లటి మాటలాడండి " అని ప్రార్థించాడు. భీష్ముడు కర్ణుని ప్రేమతో దగ్గరకు పిలిచి ఒక చేయి ఎత్తి కౌగలించుకున్నాడు. అక్కడ ఉన్న రక్షక భటులను వెళ్ళమని చెప్పి తమ మాటలు ఎవరూ వినలేదని దృఢపరచుకుని " కర్ణా ! నీ మీద కోపము నా కెందుకయ్యా ! నీవు కుల భేదముతో మాట్లాడుతున్నావని కురు పాండవుల మధ్య వైరము ఎగత్రోయుచున్నావని నిన్ను నిందించానే కాని నాకు నీపై ఎలాంటి ప్రత్యేక కోపం లేదు. అది పెద్ద వాడిగా నేను నీకు వేసిన శిక్షే కాని ద్వేషం చూపుట కాదు. నీ పుట్టుక దైవీకము. అందు వలన నిన్ను గెలుచుట సాధారణ మానవులకు అసాధ్యము. నీవు కుంతీ పుత్రుడవు కానీ రాధేయుడవు కాదు. ఈ విషయం నేను వ్యాసుడు ఏకాంతంగా చెప్పగా విన్నాను. నాకు నీ పరాక్రమము తెలియును నీవు పాండు పుత్రుడవు కనుక నీ యందు నాకు వాత్సల్యం ఉన్నది. నేను సుయోధనునికి పాండవులతో వైరము తగదు దైవాంశ సంభూతులైన వారిని జయించుట అసాధ్యం అదియును కాక సాక్షాత్తు నారాయణుడు అయిన శ్రీకృష్ణుని అండ వారికి ఉంది అని చెప్పాను . అతడు అది లక్ష్యపెట్ట లేదు. నీవు కూడా నీ తలపు మానుకుని పాండవులతో స్నేహంగా ఉండు " అని హితవు పలికాడు. అందుకు కర్ణుడు " పితామహా ! నేను కౌంతేయుడినని రాధేయుడను కానని నాకు ఇంతకు మునుపే తెలిసింది. పాండవులు మహాబలులు వారికి శ్రీకృష్ణుని అండ ఉన్నది. వారిని జయించుట కుదరని పని ఇది తధ్యము. కాని నాకు ఇప్పుడు కుంతీ పుత్రులతో పొత్తు ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు. నేను ఇప్పటి వరకు సుయోధనుని ప్రాపున మన్ననలంది విపత్కర సమయమున అతడిని విడుచుట న్యాయమా, ధర్మమా? కృతఘ్నుడనని లోకం నన్ను నిందించదా? నన్ను పిరికి వాడని నిందించదా ! అది కాక పాండవులకు నేను అనేక విధముల కీడు చేసాను. కురుసభలో పాండవులను పెక్కు విధముల అవమానపరిచాను. ద్రౌపదిని నీచంగా మాట్లాడాను. వారికి నేనంటే అసహ్యము పుట్టేలా ప్రవర్తించాను. అహర్నిశలు వారికి కీడు తలపెట్టాను. కౌరవులకు పాండవులకు మధ్య వైరము రగిల్చి పెంచి పోషించాను. ఈ సమయంలో నాకు వారితో యుద్ధమే కాని పొత్తు సాధ్యం కాదు. నన్ను నమ్మిన సుయోధనుని వంచించలేను. జయాపజయములు దైవాధీనము. నాకు పాండవులతో యుద్ధమే శరణ్యం. నా సేవాధర్మం నెరవేర్చేలా నన్ను దీవించండి. నా పరాక్రమం కృష్ణార్జునులకు చూపించే తరుణం ఆసన్నమైంది " అని పలికాడు కర్ణుడు. భీష్ముడు " కర్ణా ! నీవు అంతటి పరాక్రమశాలివి అనినాకు తెలియును. సుయోధనునికి నీ బుజబలమే సహాయకారి. రారాజుకు ప్రియం కలిగేలా ప్రవర్తించుటకు నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను " అని పలికాడు. భీష్ముని ఆదర పూర్వకమైన పలుకులు విని ఆనందించిన మనసుతో కర్ణుడు తన నివాసముకు వెళ్ళాడు " అని పలికి సంజయుడు పది రోజుల యుద్ధవిశేషాలు చెప్పడం ముగించాడు.
*భీష్మ పర్వము తృతీయాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి