శీను,లతా భార్యాభర్తలు. రామపురంలోనివసిస్తున్నారు.వీరు చాలా పేదవారు. అర ఎకరం పొలం మాత్రమే ఉంది. ఇంకా మరి ఏమీ లేదు చుట్టాలు బంధువులు కూడా ఎవరూ లేరు.రోజు ఏదో కష్టం చేస్తూ బతుకుతున్నారు. ఆ అర ఎకరం పొలంలో ఏదో పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.కొన్ని రోజులకు వీళ్ళకు కవల పిల్లలు జన్మించారు వాడు రాము, లక్ష్మణ్ ఇద్దరు పిల్లలు ఎదుగుతూ ఉన్నారు పొలం పనులు ఆ పనులు ఈ పనులు చేసి శీనుకు అనారోగ్యంతో మరణించడం జరిగింది ఇది జరిగిన కొన్ని రోజులకి పాపం లతా కూడా పొలం పని చేసేటప్పుడు ఏదో ఏదో పురుగు కొట్టి ఆమె కూడా చనిపోతుంది పాపం రామ్ లక్ష్మణ్ ఇద్దరూ కూడా చిన్నవాళ్లు తల్లి తండ్రి ఇద్దరు లేనందున పిల్లలు ఇద్దరు కూడా అనాధలుగా బ్రతుకును సాగించాల్సి వస్తుంది.రాము బడికి పోకుండా ఏదో ఒక పని చేస్తూ లక్ష్మణ్ కి అన్నం తినిపిస్తూ తమ్ముని చూసుకుంటూ ఉన్నాడు. వీళ్ళకు పొలం ఎక్కడ ఉంది అనేది ఏమీ తెలవదు.ఒక పెద్ద మనిషి వీళ్లను చూస్తున్నడు ఆ పెద్దమనిషి వీళ్ళ భూమిని కూడా దక్కించుకున్నాడు ఆకలితో అప్పుడప్పుడు లక్ష్మణ్ మన్ను కూడా తినేవాడట అది చూసిన రాము కాస్త తమ్ముడికి అన్నం పెట్టేవాడట. వీళ్ళని పట్టించుకునే వారే లేరు.
ఇంకా ఇటు పక్క వారు అటు పక్క వారు ఈసరించుకునే వారట. తల్లి తండ్రిని ఇద్దరు పోగొట్టుకొని అనాధలు అయిపోయారు. బందువులు చుట్టాలు కూడా ఎవరూ లేరు. ఊరికే ఆ మాటలు అనేవారట అలాంటి మాటలు విని బాధ భరించలేక రాము లక్ష్మణ్ ఇద్దరూ ఏడుస్తూ ఉండేవాళ్లట. ఇంటి చెత్త చెదారం లోపటనే పడుకునే ఉండేవారట. ఈ లోపట ఎక్కడో దూరపు బంధువు సుజాత వచ్చేసింది వీళ్ళ రాము లక్ష్మణ్ వల్ల గురించి తెలుసుకొని అయ్యో మా దూరపు బంధువుల పిల్లలు అయిపోయారు ఉరివాలి ఇలా పట్టించుకోవడం లేదు ఎందుకు అని వాళ్లకి అవసరాలు తీస్తూ గురుకుల పాఠశాలలో చేర్పించి ఆ పొలం కా చేసినటువంటి వ్యక్తి నుంచి అర ఏకరం పొలం వీళ్లకు ఉన్నదని చెప్పి వాళ్లకు మంచి బుద్ధులు చెప్పి చక్కగా చూసుకుంది దూరం కొడితే ఎవరైనా అనాధలే అయిపోతారు దగ్గర తీస్తే అంతా బంధువులు చుట్టాలు మన వారే అవుతారు. రామ లక్ష్మణ్ మంచిగా చదువుకుంటూ వున్నారు.
---------------------------------------------------------
నీతి:తల్లి తండ్రి లేని వారు అనాధలు కాదు. సమాజంలో మంచి మనసు లేని వారే అనాధలు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి