జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని
అమెరికాలో ఉన్నపుడు నాకూతురు అమ్మలమ్మ చెబితే
అరవై ఏండ్లు దాటిన
నా అర్ధాంగి
ఇక్కడ కూడా అన్ని సదుపాయాలుంటాయంటే
అలాగే తప్పక మీతో వస్తానని
అరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న
జగన్నాథుని గుడికి వెళ్ళితే
ఎందరో దేశ విదేశీయులు
హరే రామ హరే కృష్ణ భక్తులు
రంగు రంగుల
అందమైన రథంలో బలభద్ర, శ్రీకృష్ణ సుభద్రలను పెట్టి
వయస్సుచే పెద్దవాళ్ళమయినందున రమ్మనమని
నాచేత గణపతి శ్లోకం చెప్పించి
రథాన్ని మొదట లాగమని స్వామి ఛత్రాన్ని పట్టుకోమంటే
'జై జగన్నాథ' అని మూడుసార్లని
రంగు రంగుల దుస్తులతో
డోలు వాయిస్తు పెద్ద చిన్న
మంత్ర పుష్ప హారతులిచ్చి
చక్కటి ప్రసాదం ఇస్తే
ఏబై ఏండ్లు కాపురం చేసిన నా అర్ధాంగి
ఇండియాలో కన్న ఇక్కడ రథయాత్ర బాగా జరిగిందంటే
అవును ప్రసాదం కూడా చాలా రుచిగా ఉందంటే
మీకెప్పుడు తిండి గోలే అనగా
అందుకేగా ఆరోగ్యంగా జీవిస్తున్నా అని
జీవన్ముక్తి కి సోపానం రథయాత్ర అన్నది అక్షర సత్యం..!!
................................
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి