సతీ సహగమనం!: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 

డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
బొబ్బిలి 1757లో బుస్సీ  చేతిలో నాశనం అవ్వటంతో నాటి ఆత్మాభిమానం గల రాచకన్నెలు సతీసహగమనం చేశారు 1734లో పెద్దాపురంలో తిమ్మ అనే జమీందారు చనిపోవడంతో అతని తల్లి రంగమ్మ చితిని ఏర్పాటు చేసి మిగతా స్త్రీలతో కలిసి అందులో దూకి భస్మం అయింది అతనితో పోరిన వాడు రుస్తుంఖాన్ వాడి చేతిలో అవమానం పాలు కాకూడదు అని స్త్రీలంతా మంటకు ఆహుతి అయ్యారు ఆనంద గజపతి తో యుద్ధం చేస్తూ భర్త చనిపోవడంతో 1760లో సీతమ్మ మంటలో దూకి అగ్నికి ఆహుతి అయింది ఆనందగజపతి ఇద్దరు భార్యలు అతను రాజమండ్రిలో చనిపోవడంతో సతీసహగమనం చేశారు నూజివీడు సంస్థానంలో కూడా ఈ పద్ధతిని పాటించారు రాజా నరసింహ అప్పారావు అతని వారసుడు శోభనాద్రి అప్పారావు చనిపోయినప్పుడు వారి భార్యలు మంటలు దూకారు 1771లో సీతమ్మ వెంకటాద్రి అప్పారావు భార్య సతిగా మారింది 1789లో నరసింహ అప్పారావు చనిపోయినప్పుడు యూరోపియన్ ఆఫీసరు చేసిన అవమానంతో ఆమె చితిలో దూకింది 1822లో తూము పాపయ్య భార్య అతను చనిపోవడంతో గుంటూరులో సతీసహగమనం చేసింది దీనిని వెన్నెలకంటి సుబ్బారావు గారు తన జర్నల్లో రాశారు స్వయంగా చూశారు .అచ్చాయమ్మ  అనే వితంతువు అలాగే ప్రాణాలు తీసుకుంది కాశీ యాత్ర చరిత్రలో వీరాస్వామి దీని ప్రస్తావన చేశారు జమీందారులు రాజకుటుంబీకులు ఇలా సతీసహగమనం చేశారు.ఇది సామాన్య జనులు పాటించిన దాఖలాలు లేవు.ఇక బాలవితంతువుల స్థితి వర్ణనాతీతం.బతికున్నందుకు పీక్కుతినేరాక్షసులు ఇంట్లోవారు.అపవిత్రురాలిగా ఒంటిపూట భోజనం,ఇంటింటికీ  చాకిరీ,అంచులేని తెల్లచీర  నెత్తికి గుండు,ముసుగు,మడి తడిబట్టలతో వంటావార్పు ఆవితంతువు  జీవితం.తల్లి వదినె మరదలు అక్క చెల్లెళ్ల పురుడుపుణ్యాలతో  ఆమె బతుకు తెల్లవారేది. తొలి వితంతువివాహం 1881లో రాజమండ్రీలో  గోగులపాటి శ్రీరాములు గవరమ్మ కి ,రెండవది రత్నమ్మ  రామచంద్రరావుకి 4రోజుల వ్యవధిలో జరగటం ఓవిశేషం!1884లోసొసైటీ ఆఫ్ విడో మ్యారేజ్ ఆరంభించబడింది.కందుకూరి వీరేశలింగంపంతులుగారి తర్వాత  చిలకమర్తి  లక్ష్మీనరసింహంగారు ఉన్నవ వారు  చేసిన కృషి అమోఘం!16వశతాబ్దిలో ప్రారంభమైన దేవదాసి ఆచారం 19వశతాబ్దం దాకా సాగి ఎన్నో సంసారాలు కుప్పకూలాయి. పండిట్ మదన్మోహన్ మాలవ్యా తీవ్రంగా దుయ్యబట్టారు.ఆంధ్రదేశంలో కందుకూరివారు,రఘుపతివెంకటరత్నం నాయుడు,ఆపై దర్శి చెంచయ్య కృషితో1937,1947 బిల్లుపాసైంది. దాని కారకులు అమ్మన్నరాజా, ముత్తులక్ష్మీ రెడ్డి🌹
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం