యాదాద్రి పవిత్రత మన చేతుల్లోనే---మంజుల పత్తిపాటి


యాదాద్రి యశోదీపం... యుగయుగాల వెలుగై,
భక్తుల హృదయాల్లో భాసిల్లే దివ్య నిలయమై..!

యాదాద్రి పరిరక్షణ కోసం చేసిన చిన్న పని కూడా...
నరసింహుని పాదసేవలో అర్పించిన పుష్పమే..!

"గోవిందా... నరసింహా..." అంటూ గుండెల నిండా మొక్కుతాం,
గర్భగుడి దర్శనానంతరం గుడి నేలను చెత్తతో నింపుతాం..!

కొబ్బరికాయ కొట్టి కోరికలు తీర్చమని వేడుకుంటాం,
ప్లాస్టిక్ చెత్తతో పవిత్ర ప్రాంగణాన్ని కలుషితం చేస్తుంటాం..!

దేవుడికి పూలదండ వేయడం భక్తికి ఒక గుర్తయితే,
దేవుడి ఇంటి ఆవరణాన్ని శుభ్రంగా ఉంచడం భక్తికి పరమార్థమైతే...
పర్యావరణ పరిరక్షణే పరమపూజ అని పలుకుదాం..!

పచ్చని ప్రకృతినే పరమప్రసాదమని భావిద్దాం.
యాదాద్రిని దర్శించడమే కాదు... యాదాద్రిని రక్షిద్దాం..!

మన చేతులతో చెత్త తొలగించి సేవాభక్తిని చాటుదాం,
ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి పచ్చదనానికి స్వాగతం పలుకుదాం,
ప్రతి మొక్కను నాటి భవిత తరాలకు వరమై నిలుద్దాం,
దేవాలయ ప్రాంగణంలో ప్రతి ప్లాస్టిక్ సంచి ప్లాస్టిక్ 
బాటిల్ మనకు శాపమని గుర్తుంచుకుందాం..!

శుభ్రమైన ప్రతి అడుగు శ్రీనరసింహునికి పుష్పార్చనే,
పచ్చదనంతో నిండిన ప్రతి ప్రాంగణం పరమాత్మకు హారతియే.
యాదాద్రి మహిమను కీర్తిస్తూ... ప్రకృతిని కాపాడుదాం,
భక్తి, శక్తి, శుభ్రతలతో స్వామివారి ఆశీస్సులు పొందుదాం..!
-----------------------------------------------------------------------
- శ్రీమతి మంజుల పత్తిపాటి
యాదాద్రి భక్తురాలు 
చరవాణి 9347042218
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం