నలుగురు, లేక ముగ్గురు మంత్రులతో
విడివిడిగా గాని అందరితో గాని
రహస్య ఆలోచనలు చేయుచున్నావా?
నాయనా! వేద శాస్త్ర ధర్మములను యెరిగి
నీవు కృతజ్ఞుడవు అవుతున్నావా?
నీ భార్య అనుకూలవతిగా మెదులుతుందా?
నీలోన సద్గుణములను పెంపొందిస్తుందా?
ఓ భరతా నేను చెప్పినట్టి బోధనలను
ధర్మముతో నీవాచరించుచుంటివా?
నేను చేసిన బోధనలు జీవితంలో
నీకు తప్పకుండా ఉపయోగపడును .
నాయనా! మన తండ్రి తాత ముత్తాతలును
ఆచరించిన ధర్మమును పాటించుచు
నీవు రాజ్యపాలన వొనర్చుచున్నావా?
అదే సత్పురుషులు ఆచరించవలసిన ధర్మము.
ఆత్మజ్ఞానీయై న్యాయ దండము చేబూని
ప్రజలను ధర్మబద్ధంగా పాలించినచో
సమస్తభూమండలము అతనికి వశమగును.
ఆ ఫలితముగా అతడు తనువు వీడినపిదప స్వర్గము చేరును.
========================================
అయోధ్యకాండమందు 100 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి