69వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
తనకు దుస్వప్నమురాగా భరతుడు చింతాక్రాంతుడగుట 




వసిష్ఠమహార్షి పంపిన దూతలు 
కేకయరాజు నగరమున ప్రవేశించిరి 
అదే రాత్రి భరతుడు దూస్వప్నమును గాంచెను
వేకువజామున వచ్చిన కలగూర్చి బీతిచెందెను 

చిన్నబోయి యున్న భరతుని మిత్రులు చూసి 
ఓ మిత్రమా! మేమంతా నీ చుట్టున్నా గాని
నీవు సంతోషించుటలేదు ఎందుకని?
ఓ మిత్రమా! నాకు దుస్వప్నము వచ్చినది 

కలలో మా తండ్రి గిరిశిఖరము నుండి 
కలిషితమైన గోమయముతో గూడియున్న
మడుగులో పడుచుండుట చూచితిని 
ఆవు పేడలో కప్ప వలె ఈదులాడుచుండెను 

వేకువ జామున భయంకరమైన కలగంటిని 
దీని ఫలితముగా నేనో, రాముడో,మహారాజో,
లక్ష్మణుడో మరణించుట తథ్యము
ఆ కారణముగా కృశించిపోవుచున్నాను. 

నాపై నాకే రోత కలుగుచున్నది 
అందులకు హితువేమో తెలియకున్నది 
స్వప్నమున జూచిన దుఃఖస్థితిని తలచుకొనగా
నా హృదయము నుండి భయము తొలుగుటలేదు.

==========================================
అయోధ్యకాండము నందు 69వ స్వర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు