ప్లాస్టిక్ భూతం : - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా

 

శాస్త్ర సాంకేతికత పెరిగితే 
అభివృద్ధి కి చిహ్నమే కావాలి 
అది ప్రాణికోటి వినాశనానికి గాకూడదు .

పంచభూతాల కలయికతో
పుడమిపైకి వచ్చిన ఓ మనిషీ 
నీ మనుగడకు కారణమైన వాటిని
నీ పరిజ్ఞానంతో కనిపెట్టిన 
ప్లాస్టిక్ అనే మహమ్మారితో తయారైన 
ఉదయాన త్రాగే టీ, కాఫీ కప్పులతో ప్రారంభించి 
ఇంట్లో వాడే  ఆహారాన్ని నిల్వవుంచేందుకు
శుభ అశుభ కార్యాలలో 
ఇందుగలదండు అందులేడన్నట్లు ఉపయోగించి
విచక్షణా రహితంగా భూమిపొరలలో ,త్రాగే నీటిలో 
శ్వాసకు ఉపయోగపడే గాలిలో వ్యర్థాలుగా 
విసర్జిస్తున్న మనిషి 
అవి నాశనం చెందక  భయంకర కాన్సర్ వ్యాధులను కలిగిస్తున్నాయని మరువకు .

పర్యావరణ సమతుల్యం 
దెబ్బతీసే ప్లాస్టిక్ భూతాన్ని విసర్జించి 
పచ్చటి చెట్లు ప్రగతికి సోపానాలన్న 
సుందర్ లాల్ బహుగుణ 
మేథా పాట్కర్ వంటి 
పర్యావరణ పరిరక్షకుల అడుగు జాడల్లో నడచి 
శతమానం భవతిగా 
ఆరోగ్యంగా జీవిద్దాం...!!
..............................

కామెంట్‌లు