ఇక్ష్వాకు మహారాజులు పాలించిన
ఈ అయోధ్య పాడుబడి పోయెను
ఇక నేను అయోధ్యలో అడుగుపెట్టను
నేను జీవించను అగ్నిలో ప్రవేశించెదను
భరత శత్రాజ్ఞుల శోకమును జూచి
వసిష్టమహర్షి భరతునితో ఇట్లంటాడు
మీరిప్పుడు దుఃఖించే సమయము కాదు
ఓ భరతా! మీ తండ్రి గారి అస్థికలను
అస్తసంచయనము చేయల్సి యున్నది
అందులకు ఆలస్యము చేయుచుంటివేల?
ఆ కార్యములను తొందరగా నిర్వర్తించుము
ఓ భరతా! ఆకలిదప్పులు, శోకమోహములు,
జననమరణములు,అను ఈ మూడు ద్వంద్వములను
సమస్తప్రాణులు పొంది తీరవలసినదే
ఈ విషయమున ఇట్లు శోకించుట తగదు
భరతశత్రేజ్ఞులు ఊరట చెందినవారై
వారు పురోహితుల చెంతకు చేరినారు
అస్తిసంచయనాది కార్యములను
వారిచే అమాత్యులు పూర్తి గావించరి.
===========================
అయోధ్యకాండమందు77వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి