10 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
తాను ప్రతిజ్ఞాభంగమునకు పాల్పాడను". అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరుచుట 




సీతాదేవి పలికిన పలుకులను విని
శ్రీరాముడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను 
ఓ దేవీ ! నీవు మహోన్నతమైన 
జనకరాజు వంశమును జన్మించినావు. 

ఓ సీతా! నీవు ధర్మాత్మురాలవు
నాపై నీకు గల అనురాగము గాఢమైనది
అన్ని విధముల సదావేళలలో నీవు 
నా హితము గోరుచు వచించితివి.

ఓ దేవీ! క్షత్రియులు ధనుర్దారులైయున్న చోట 
ఆర్ధనాదము వినబడరాదని నీవే అంటివి 
నీవు పలికిన మాటలు నేను వింటిని
ఇక నేను చెప్పవలసినది ఏమున్నది

ఓ సీతా! దండకారణ్యమునందు 
దీక్షతో తపస్సొనరించుచున్న
ఆ మునులు ఆర్తులై స్వయముగా వచ్చి 
నన్ను శరణుజొచ్చిరి వారి రక్షణ నా బాధ్యత

వారు కందమూలములను భుజిస్తూ 
ధర్మనిరతులై జీవించుచున్నారు 
క్రూరాత్ములైన రాక్షసులు పెట్టు బాధలను 
తట్టుకోలేక భయగ్రస్తులై యున్నారు.

కామెంట్‌లు