వసిష్టుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసలరాజ్య పరిపాలనను చేపట్టమని కోరుట
వసిష్ఠుడు ఆయనతో ఇట్లు పలికెను
నాయనా! రఘునందనా! జనులు
ఈ లోకము నుండి పరలోకములకు వెళ్ళుటను
తిరిగి వచ్చుట జాబాలి ఎరుగును
అతడు నాస్తికుడు కాడు ఓ లోకనాథా!
ఈ వనముల నుండి నిన్ను అయోధ్యకు
మరలించుటకై అతడు ఇట్లు పలికెను
ఈ లోకముయొక్క ఆవిర్భవము తెలిపెదను వినుము
ఈ సృష్టి ప్రారంభ సమయమున
జలమయమై యుండెను అందునుండే
ఈ భూమండలము ఏర్పడెను
పిమ్మట స్వయంభుడైన బ్రహ్మదేవుడు
దేవతలతో గూడి ఆవిర్భవించెను.
ఆ బ్రహ్మయే వరహా రూపమున ప్రకటితుడై
జలమగ్నమైయున్న పృథ్విని ఉద్ధరించెను
అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా
అప్పుడు ఈ జగత్తును సృష్టించెను.
ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి
బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను అతడు శాశ్వతుడు
ఆయన నుండి మారీచి జన్మించెను.
ఆ మారీచుని కుమారుడే కశ్వపుడు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి