ఓ వీరా! నీవు ఇలా! దండకారణ్యంలోప్రయాణము చేయుట నాకు తృప్తిగా లేదునేనందుకు కారణములను తెలుపెదనునేను జెప్పే మాటలు వినుము ఓ శ్రీరామా !నీవు ధనుర్భాణములను చేతబట్టిలక్ష్మణసహితుడవై వనములో కెళ్ళినాకవనములో సంచరించేటిరాక్షసులపై, మృగములపైబాణములను ప్రయోగింతువు గదా!ఓ మహా బహూ! పూర్వకాలముమృగములు, పక్షులు హాయిగా తిరుగుతూప్రశాంతముగా జీవించుచుండేవిఆ ప్రశాంత వనమున ఒక తపస్వి ఉండేవాడుఅతడు నిర్మలమైన మనసు గలవాడుశచీపతియైన ఇంద్రుడు ఆ ముని తపస్సునుబంగపరచుటకు ఒక ఖడ్గము తీసుకునిభటుని రూపములో ఆశ్రమమునకు వెళ్లెనువాడియైన తన చేతిలోని ఖడ్గమునుఆ తాపసికాడ న్యాసముగా ఉంచెనుఆ తాపసి ఆ రోజు నుండి ఆ ఖడ్గము రక్షించుటకైనిమగ్నుడైయుండి తపస్సునందు ఏకాగ్రతను కోల్పోయెను.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి