అతని బుద్ధి హింసాత్మకముగా మారెను
ఆ ఖడ్గము యొక్క సంస్కారము వలన
ఆ ముని అధర్మమార్గమునకు లోనయ్యెను
అతడు హింసాత్మక చర్యలకు దిగెను
అందువల్ల నరకము ప్రాప్తించెను
హింస ప్రవృత్తికి కలిగించేటి విధానము
శాస్త్ర సంస్కరణ జరిగిన సంగతి ఇది
ఓ ఆర్యా! శస్త్రధారణముల వలన
బుద్ధి కలిషితమగును ప్రభూ! కనుక
వనవాస దీక్ష ముగిసిన పిమ్మట
అయోధ్యలో క్షత్రియ ధర్మమును పాటించుడు
ధర్మాచరణమువలన మేలు జరుగును
ఈ వనమున తపోదీక్షులమై ఉండవలెను
తపోదీక్షను పాటించిన
ముక్తి మార్గము లభించును
ఈ జగత్తునకు ధర్మమే ఆధారము .
ఓ సౌమ్యుడా! నిర్మలమైన బుద్ధితో
నిత్యము తపోవన ధర్మమునే ఆచరింపుము
సోదరుడగు లక్ష్మణునితో ఆలోచించుము అని
సీతాదేవి శ్రీరామునికి భక్తితో తెలిపెను.
అరణ్యకాండమందు 9 వ సర్గ సమాప్తం.🙏🏻

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి