ఎట్టి వైరభావము లేకుండ రాక్షసులను చంపబూనుట ఎంతవరకు యుక్తము?
అని సీతాదేవి శ్రీరామునకు విన్నవించుట.
ఆర్య పుత్రా! ఏమో నీ ధర్మము సూక్ష్మమైనది
అది తెలుసుకొనుట మిక్కిలి కష్టము
ఏ వైరము లేకుండా చంపుట పాపము
ఓ రాజకుమారా! నీవు ధర్మాత్ముడవు
ఏకపత్నివ్రతుడవు సత్యవంతుడవు
ఓ సత్యవచనా! మహాత్మా! సకలేశ్వరసంపన్నా!
ధర్మము నీ చెంతనే యుండెను.
ఓ మహాప్రభూ! నీవు జితేంద్రేయుడవు
వైరాగ్యాదిసకలసద్గుణములకు పెన్నిధివి
సమస్త ధర్మములను నిర్వహించుట
జితేంద్రేయులకు మాత్రమే సాధ్యము.
వైరాభావము లేకున్నా గాని మానవులు
ఇతర ప్రాణులను హింసించుచుందురు
ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది
ఏ వైరము లేని రాక్షసులను వధించుటేలా
దండకారణ్యంలో నివసించుచుండెడి
మహర్షులను రక్షించుటకై రాక్షసులను వధించెదనని
నీవు ఆ మహర్షితో ప్రతిజ్ఞ చేసితివి
నీ హితము కోరే నా మనస్సు బాధగా ఉంది.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి