తెలుగు సాహిత్యము ప్రాచీన కాలము నుండి ప్రత్యేకత సంతరించుకున్నది. దశలవారీగా అభివృద్ధి చెందినది. నన్నయ యుగమునకు ముందు కాలంలో జానపద సాహిత్యంగా ఉండేది. తదుపరి నన్నయ కాలం నుండి 15వ శతాబ్దం వరకు అనేక కావ్యాలు తెలుగులో వెలసాయని నిర్ద్వంద్వంగా చెప్ప వచ్చును. అందుకే ఈ యుగాన్ని కావ్య యుగమని అంటారు. తర్వాత కాలంలో ఆంధ్ర వాఙ్మయమున కొన్ని స్వతంత్ర కావ్యాలు కూడా వెలసాయి. ఇవి కూడా సంస్కృతము నుండి అనువ దింపబడినవే, పురాణముల నుండి ఇతివృత్తం తీసుకొని వర్ణనలతో ధీరోదాత్త నాయకులను శృంగార రస ప్రధానము అలంకారిక శైలిలో రాయడం ఆరంభించారు.ఇవి ప్రబంధములుగ కీర్తికెక్కాయి. అందుచేత ఈ కాలమునకు ప్రబంధ యుగం అని పేరు వచ్చినది. ఆ తరువాత కాలంలో తెలుగు సాహిత్యము దక్షిణాదిన విస్తరిల్లినది. సుమారు 1857 సంవత్సరము వరకును గల కాలాన్ని దక్షిణాంధ్ర యుగము అని అంటారు. ఈ యుగంలో తంజావూరు, చెంజి నాయక రాజుల ఆస్థానములందు తెలుగు సాహిత్యము అభివృద్ధి చెందింది.1857 సంవత్సరములో బ్రిటిష్ పాలన పై భారతీయులు తిరుగుబాటు చేశారు. అంతవరకు పాశ్చాత్య నాగరికత వ్యామోహ పరవశులై ఉండిన ఆంగ్ల విద్యాధికులకు అది కనువిప్పు అయ్యెను. అప్పుడు కొందరు కవులు తెలుగు సాహిత్యములో ప్రాచీన సాహిత్య సాంప్రదాయాలను పునరుద్ధరించ వలెనని సంకల్పించారు. ఈ కాలం లోనే చిన్నయ తెలుగు భాషకు ఒక వ్యాకరణమును వ్రాశారు, దాని ఆధారంగా నీతి చంద్రికయను గద్య కావ్యం రాశాడు.దీని ఫలితంగా "పద్యమునకు నన్నయ్య, గద్యమునకు చిన్నయ" అను నానుడి వచ్చింది.. తెలుగున నిఘంటువు రాయాలని సంకల్పించాడు. ముగియకుండానే దివంగతుడయ్యాడు.ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగు భాషపై పడింది.దీని ఫలితమే చిన్నయ్య సాహిత్యం మరియు కందుకూరి వంటి ఆధునిక కవుల అద్భుత సాహిత్యము ఉత్పన్నమయ్యింది.ఆధునిక కవులలో చెప్పుకోదగిన వాడు కందుకూరి. వేద శాస్త్రములకు పట్టుగొమ్మ. రాజమహేంద్రవరము, సంస్కరణోద్యమాలకు ఆటపట్టు. ఆర్ష సంస్కృతికి నేటి వరకు అలరారు పట్టణమది. గోదావరి నది తీరమున రాజమహేంద్రవరము నన్నయ్య పుట్టిన నేలతెలుగు జాతి గర్వించదగినదీ ప్రాంతము. తెలుగు జాతి చెప్పుకో దగిన ఆణిముత్యం,ఆధునిక సాహిత్య వైతాళికుడు, యుగపురుషుడురాజమండ్రి పేరు చెప్పిన వెంటనే స్పురించేది,కందుకూరి వీరేశలింగం గారు.ఈయన 1848సం.ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. ఇతని తల్లి పున్నమ్మతండ్రి సుబ్బారాయుడు. ఈతని వయస్సు నాలుగేళ్లుముగియకుండానే తండ్రి మరణించాడు. అందు చేత పెద తండ్రి వెంకట రత్నం గారు ఇతనిని పెంచారు. రాజమండ్రిలోని సోమరాజుగారి బడికి పంపించారు. వీరేశలింగంగారు ఏక సంథాగ్రాహి. ఈ బడిలోనే అమర కోశం, బాల రామాయణం చదవడమే గాక అనేక పురాణాలు ఔపాసన పట్టారు.తెలుగు చదువులు పూర్తయ్యాక కాలం వృధా చేయక ఉదయం దూరి సోమయాజులు గారి వద్ద రఘువంశం, సాయంత్రం పెద తండ్రి గారి వద్ద తెలుగు సాహిత్య గ్రంథాలు నేర్చుకునేవాడు.ఇతడు తెలుగుతో పాటు సంస్కృత, ఆంగ్ల భాషలలో పండితుడు.ఈయన పుట్టుకకు పాతికేళ్ల ముందు వరకు సతీ సహగమన దురాచారం ఉండేదిఆ కబుర్లు తాతమ్మ చెబితే విని చలించి పోయే వాడు. మనసులో మథన పడేవాడు. స్త్రీ జనోద్దరణకు కంకణం కట్టుకున్నాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించి, వారిని చైతన్యవంతుల చేయ తలంచాడు."సతీ హిత బోధిని" అనే పత్రికను స్థాపించాడు. (ఇది 87వ భాగం) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
విరహవేదన:- రాజుపాలెం దినేష్ కుమార్
• T. VEDANTA SURY

రాజ్యానికి శాపం:- - మారోజు శివమణి- ఆరవ తరగతి - ప్రభుత్వ ఉన్నత పాఠశాల- డైట్ గొల్లగూడ నల్గొండ
• T. VEDANTA SURY

అమ్మ :- శ్రీ నిత్య.- 9వ , తరగతి
• T. VEDANTA SURY

విశ్వసుందరి!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి