తెల్ల మచ్చలు , బొల్లి -2- నివారణ - పి . కమలాకర్ రావు

తెల్ల మచ్చలు సోరియాసిస్ వ్యాధి వలన కూడా వస్తాయి. విరుద్ధాహారాల సేవనం వలన వాత, పిత్త, కఫాల సమతుల్యం దెబ్బ తినడం వలన ముఖ్యముగా పిత్త దోష ప్రభావం చర్మం పై రావడం వలన చర్మ వ్యాధులు వస్తాయి. తుత్తురు బెండ కాయలు లేక తుత్తి కాయలు తెచ్చి నీటిలో వేసి మరిగించి తాటి కలకండ లేక బెల్లం వేసి చల్లార్చి తాగాలి. తుత్తురు బెండకాయ లు ఎండినవి కూడా ఔషధంగా పనికి వస్తాయి. కొద్ది రోజులు తాగితే బొల్లి మచ్చలు తగ్గి పోతాయి. మారేడు కాయను సానపై గంధం తీసి మచ్చలపై రాస్తే బొల్లి మచ్చలు తగ్గి పోతాయి. దేశవాళీ ఆవుమూత్రం +ఆవు పేడ రసం +వేపాకులను దంచి తీసిన రసం కలిపిన మిశ్రమాన్ని ఒళ్ళంతా మచ్చలపై ప్రతి రోజూ పూస్తే తెల్ల మచ్చలు బొల్లి పూర్తిగా తగ్గి పోతుంది .


కామెంట్‌లు