శ్రీ కృష్ణ శతకము - పద్యం (౧ - 1)


 కందము :

*శ్రీ రుక్మిణీశ కేశవ*

*నారద సంగీత లోల | నగధర శౌరీ*

*ద్వారక నిలయ జనార్దన*

*కారుణ్యముతోడ మమ్ము | గావుము కృష్ణా!*


తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..


నీవు, శ్రీ లక్ష్మీ అవతారమైన రుక్మిణీ దేవికి ఆరాధ్యడవు, భర్తవు. నారదముని గాన ప్రవాహడోలికల్లో ఆనందంతో పరవశించేవాడివి.  కొండను ధరించిన మహా వీరుడివి. ద్వారకలో కొలువు వుండేవాడివి. జనులు అనే రాక్షసులను అణిచివేసే వాడివి.  ఇంతటి ఘనుడవైన ఓ! కృష్ణా !! దయతో కరుణజూపి మమ్మల్ని రక్ష చేయి స్వామీ ...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు


*"ఈ శతకం భక్తి ప్రాధాన్యమైనది" అని నిన్న చెప్పుకున్నాము.  శతక ఆరంభం లోనె నృసింహ కవి తన ఆర్ద్రతను, భక్తి భావాన్ని మనకు పరిచయం చేస్తూ, భగవంతుని చేరుకునే నవవిధ మార్గాలలో "భక్తి" ప్రాముఖ్యత చెప్పకనే చెప్పారు.  ఆ భక్తి మార్గాన్ని చుక్కానిగా చేసుకుని, బ్రతుకు నావను "మోక్షము" అనే తీరానికి చేర్చుకుందాము* 

*నమో కృష్ణ! నమో కృష్ణ!*

అంటూ ముందుకు సాగుదాము.


.....ఓం నమో వేంకటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు