నుంచి ఒక లేఖ వచ్చింది. దానితో పాటు ఆహ్వానపత్రం కూడా జతపరిచారు.లేఖలో చెన్నైలోమా బస వివరాలు పొందుపరిచారు. మాకుకేటాయించిన వసతి పేరు ది రెసిడెన్సి.చెన్నైలోనిజి.ఎన్.చెట్టీ రోడ్ లో ఉంది.నవంబరు 13 నుంచి16 వరకు మాకక్కడ వసతి సౌకర్యం ఏర్పాటుచేశారు.లేఖతో జతపరిచిన ఆహ్వానపత్రంవర్ణశోభితంగా ఉంది. అది 4పేజీల పత్రం.మొదటిపేజీలో కుడి వైపున భారత ప్రభుత్వం 3 సింహాలగుర్తు, ఆ పక్కన గాంధీ 150వ జయంతి ఉత్సవాల బొమ్మ, ఆ తరువాత మన జాతీయభాష హిందీ లో సాహిత్య అకాడమీ అని రాసి ఉన్న అక్షరాలతో తీర్చిదిద్దిన మెమెంటో చిత్రంఉన్నాయి.ఆ గుర్తుల కింద చెన్నై నగరంలోనివళ్లువార్ కూటం అని పిలిచే ఒక రాతి రథంచిత్రముంది. ఆ పేజీలోనే ఆంగ్లంలోను తమిళం లోను అవార్డుల ప్రదానోత్సవం జరిగే తేదీ జరిగేసమయం జరిగే చోటు సూచించారు. 2019 నవంబర్ 14 సాయంత్రం 5గం.కు చెన్నైలోనిమైలాపూర్ ప్రాంతంలోని భారతీయ విద్యాభవన్మెయిన్ ఆడిటోరియమ్ లో జరుగుతున్నట్టుపేర్కొన్నారు.రెండవ పేజీలో 14వ తేదీ కార్యక్రమంవివరాలు,15వ తేదీ కార్యక్రమం వివరాలున్నాయి.ఆ పక్కన 23 మంది వివిధభాషలకు చెందిన బాలసాహితీరచయితల పేర్లున్నాయి.ఈ వివరాలన్నీ ఆంగ్లభాషలోఉన్నాయి. నా పేరు చూసుకుని ముచ్చట పడ్డాను.3వ పేజీలో 2వ పేజీలో ఉన్న విషయమేస్థానిక తమిళ భాషలో ఉంది.4వ పేజీలో ఎడమ వైపు తంజావూరు బృహదీశ్వరాలయం చిత్రముంది.కుడివైపు అకాడమీ బుక్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ కార్యక్రమం నవంబర్ 14 - 15 తేదీలలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ కింద సాహిత్య అకాడమీ గుర్తు, అడ్రస్ ఉంది.ఆహ్వాన పత్రాన్నిఆ రోజు పదేపదే చూస్తూ గడిపాను.(సశేషం)
235.ఆహ్వాన పత్రం:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి