*ఈ పద్యం మనందరం మన చిన్నతనంలోనే కంఠస్థం చేసినది. ప్రతి తెలుగువాడికి నాలిక వివర వుండే పద్యం.*
కందము :
*నీవే తల్లివిఁదండ్రివి*
*నీవే నా తోడు నీడ | నీవే సఖుఁడౌ*
*నీవే గురుఁడవు దైవము* *నీవే నాపతియు గతియు | నిజముగ కృష్ణా!*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
నాకు తల్లివి తండ్రివి నువ్వే. నాకు ఎల్లప్పుడూ వెంటవుండే స్నేహితుడవు, సహాయకుడవు నీవే. నాకు దారిచూపే గురుడవు నీవే. నేను ఆరాధించే దేవుడవు నువ్వే. నీవే నన్ను తరింప చేయగలవాడవు. నీవే నా భర్తవు, కర్తవు. ....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు
*"శ్రీ కృష్ణ పరమాత్మడే ప్రతీ జీవికి సర్వస్వం అనే విషయాన్ని" ఇక్కడ నొక్కి చెప్పారు. పరమాత్ముడు, పరాత్పరుడు, అయిన శ్రీ కృష్ణుడు ఒక్కడే. "అంతయు నీవే హరి పుండరీకాక్ష" అని అన్నమయ్య చెప్పినట్టు*
*"నంద నందనా గోపాలా"* అంటూ ముందుకు సాగుదాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨ - 2)
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి