కొన్ని ఎర్రని రిక్క మందారం పూలు సేకరించి శుభ్రంగా కడిగి తొడిమలు తీసి వేసి నీటిలో వేసి మరిగించి అందులో దానిమ్మ రసం కూడా కలిపి కొద్దిగా చక్కెర వేసి చల్లార్చి తాగితే రక్త వృద్ధి చాలా త్వరగా జరుగుతుంది.చర్మంపై దురదలు వస్తే దొండ ఆకులు దొండ పువ్వులు ముద్దగా నూరి కొబ్బరి నూనె వేసి తైలంగా కాచి రాసుకుంటే దురదలు తగ్గిపోతాయి.పాదాల పగుళ్లు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కొని ఒక గుడ్డ తో తుడుచుకొని ఆముదంలో కొద్దిగా పసుపు సున్నం వేసి బాగా కలిపి పాదాలకు పట్టించాలి పాదాల పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి.అనాస పండు (Pine Apple) అప్పుడప్పుడు తింటుంటే మలద్వారం వద్ద, మూత్ర ద్వారం వద్ద, దురద పుట్టించే క్రిములు నాశనమవుతాయి. చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.కానుగ చెట్టు ఆకుల్ని మెత్తగా నూరి నీళ్లలో వేసి మరిగించి చల్లార్చిన కషాయంతో పుళ్లను కడిగితే, చీము కారే పుండ్లు కూడా తగ్గిపోతాయి.
కొన్ని చిట్కాలు -2:- పి . కమలాకర్ రావు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి