అతిమధురం పొడి కరక్కాయ పొడి నీళ్లలో వేసి మరిగించి చల్లార్చి త్రాగితే దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది.మలబద్దకం పోవడానికి అతిమధురం పొడి ,సోంపు, కలకండ నీటిలో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. మలబద్ధకం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది మానసిక ఆందోళనకు కూడా మంచి మందు. స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.కీరదోసకాయ మధ్యలో ఉండే గింజలు, వట్టివేర్లు, నీళ్లలో మరిగించి చల్లార్చిన కాషాయం త్రాగితే మూత్రంలో మంట, మూత్ర ద్వారం లో పుళ్ళు తగ్గిపోతాయి.కీర దోసకాయ గుజ్జు, అతిమధురం పొడి, వట్టి వేర్ల పొడి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం పై నల్ల మచ్చలు పోయి నిగనిగలాడుతుంది.
కొన్ని చిట్కాలు -3,: - పి కమలాకర్ రావు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి