ఎనిమిది లో పాసయినవాళ్లందరూ తొమ్మిదిలోకి వచ్చారు.వాళ్లు ఎనిమిదిలో ఉండగానే తొమ్మిదోతరగతి అప్గ్రడేషన్కోసం దరఖాస్తు సమర్పించడం జరిగింది.షాణ్మాసిక పరీక్షలయ్యే లోపే అనుమతి రావాలి కాని,ఏ కారణం వల్లనో రాలేదు.అప్గ్రడేషన్ కాకుండా పరీక్ష పేపర్లు పంపడానికి వీలులేదన్నారు.బతిమాలి షాణ్మాసిక వెళ్లదీసాం.వార్షిక పరీక్షల తేదీ దగ్గరకు రాబోతుంది.అనుమతి లేనిదే పరీక్షలు రాయించడం కుదరదు.ఆ సంవత్సరం రాయకుంటే ఆ సంవత్సరం వృథా అవుతుంది.ఏం చెయ్యాలన అని బాగా ఆలోచిస్తే ఓ పరిష్కారమార్గం కనిపించింది.స్కూల్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి తొమ్మిదవ తరగతి పిల్లల తల్లి దండ్రులందర్నీ పిలిపించాను. విషయమంతా వివరించి ఈ సంవత్సరం వృథా కాకుండా ఉండాలంటే ప్రైవేటుగా పరీక్షలు రాయాలి.దానికి ప్రతి విద్యార్థికి రూ.250/- అవుతుందని చెప్పాను. కిందా మీదా పడి పరీక్షఫీసు వసూలు చేసి ప్రైవేటుపరీక్షకు కట్టించడం కోసం కాగజ్ నగర్ ఓల్డ్ గవర్నమెంటు హైసికూలు వెళ్లాను.మండలానికంతటికీ కాగజ్ నగర్ లోని ఓల్డ్ గవర్నమెంటు హైస్కూలుప్రైవేటు పరీక్షల కేంద్రం గా కొనసాగుతూ వస్తున్నదన. పరీక్షల నిర్వహణ బాధ్యతంతా ఏఎస్సార్ మూర్తి సారే చాలా కాలం నుండి చూస్తున్నారు.సారు చిరపరిచితులు.ఎప్పుడు కలిసినా అన్నా! అనే సంబోధన ఆత్మీయంగా ఉండేది.విషయమంతా వివరించి పరీక్ష ఫీసు కట్టాను. సరే ఇంతలో పరీక్షలు దగ్గరకి రాబోతున్నాయి.పిల్లందరూ పరీక్షలన్ని రోజులు కాగజ్ నగర్ వచ్చి రాయాలంటే చాలా పెద్ద సమస్య.మా స్కూల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందేమోనన మూర్తి సారు నడిగితేవారు అనుమతి లేకుండా వీల్లేదన్నారు.చాలా ఏండ్లు మండల విద్యాధికారి పోస్టులు నింపక స్థానిక ఎం.పి.డి.ఓల కే ఆ అధికారాలిచ్చి నడిపంచటం జరిగింది.నేను జాయినయినప్పుడు రాముగారు ఎంపిడివో. గా ఉన్నారు.ఎడ్యుకేషన్ కు సంబంధించిన పనులన్నీ కోట ప్రసాద్ సారు చూసుకునేవారు.హైస్కూల్ గా మారేదాకా వాళ్ల నుండే తీసుకునేవాళ్లం. పిబిసి పనులు చాలా ఉండేవి.దానితో ప్రసాద్ సార్ తో మంచి మైత్రి ఏర్పడింది.ఆయన వల్ల కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను.ఎప్పుడైతే హైస్కూలయ్యిందో మేనేజ్ మెంట్ మారింది.బిల్లులు జెడ్పీ లో సబ్మిట్ చేయడం అదంతా వేరే గోల.సరే అసలు విషయానికి వస్తే ,నా సమస్యా సమయానికి మండలానికి కొత్తగా మండల విద్యాధికారి వచ్చారు.పేరు సత్యనారాయణరావు.సారుతో పరిచయం ఏర్పడింది.మంచి మనిషి.దానికి తోడు కరీంనగర్ వారు కావడంతో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది.సరే ఆయన ఏమైనా హెల్ప్ చేస్తారేమోనని ఆయన్నడిగాను.ఆయనఅది డిఇఓ పరిధిలోనిది .మీరు డిఇఓకు అప్లికేషన్ రాసి నాతో రండి నేను చెబుతాను అన్నారు.సరే అని ఆదిలాబాదుక వెళ్లాను.అప్పుడు డిఇఓ గా గోపాల్ రెడ్డిగారున్నారు.మామూలుగా అయితే డిఇఓ గారు పర్మిషన్ ఇచ్చేవారు కాదు కాని ఒక ఎం ఇ ఓ నేను ఆస్కూలు కోసం పడుతున్న శ్రమ వివరించటంతో ఆ అప్లికేషన్ మీద సంతకం చేసారు.సత్యనారాయణరావు గారు ఈ విషయం మరచిపోయి ఉండవచ్చు.కాని చేసిన మేలు నేను మరువలేను.పరీక్షలు మా స్కూల్లోనే రాయించి పరీక్షా పత్రాలు కాగజ్ నగర్ కేంద్రంలో అప్పగించమని డిఇఓ గారి ఆమోదం చూసి మూర్తి సారు ఆశ్చర్యపోయారు.అన్నా ఏం జాదవ చేసినవే! గిట్ల పర్మిషన్ ఎట్ల సంపాయించినవే అని చవువుగా పలుకరించి ఓకే ఇంకేంది.పరీక్షల టైము రా అన్నా పేపర్లు తీసుకపో అన్నారు.అమ్మయ్య .పెద్ద సమస్య తీరింది.అనుకున్నా. అలా తొమ్మిదవ తరగతి పరీక్షలు రాయగలిగారు రాస్పల్లి పిల్లలు.డిఇఓ గోపాల్ రెడ్డి గారిని తరువాత కలిసినప్పుడు ధన్యవాదాలు చెప్పుకున్నాను.మంచి వాళ్లను మరువకూడద.నిన్ననే ఒక చిన్న కవిత రాసాను‘మంచితనం మల్లెవోలెతెల్లని ఒక పుష్పంఎవరి దోసిలిలొ ఉంటేవారికిచ్చు పరిమళం’(సశేషం)
ఉపాధ్యాయపర్వం-43: - రామ్మోహన్ రావు తుమ్మూరి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి