ఉపాధ్యాయపర్వము-48: - రామ్మోహన్ రావు తుమ్మూరి

 ఈ ముచ్చట తోటి రాస్పల్లి పర్వం ముగిస్త.ఇంతకు. ముందు చెప్పాను బదిలీ మీద  కాగజ్ నగర్ వచ్చే విషయం.ఊరి వాళ్లకు నేను ఉండాలని ఉన్నా నా పరిస్థితుల దృష్ట్యా తప్పలేదు.సరే వెళ్లేప్పుడు వీడ్కోలు అనేది ఒకటుంటుంది కదా!అంత క్రితం రెండు సార్లు వనభోజనాలకు వెళ్లటం జరిగింది.ఈ సారి కూడా మళ్లీ వనభోజనాల తరుణం వచ్చింది.అయితే మా టీచర్లు వనభోజనాలు వీడ్కోలు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది.
      కాగజ్ నగర్ మండల్ జంబుగ ఫారెస్ట్ కేంద్రం బాగా ఫేమస్.దాదాపు గా ఎక్కువ శాతం పిక్నిక్ అనగానే జంబుగనే గుర్తుకు వస్తుంది ఎవరికైనా. అటువంటి జంబుగ రాస్పల్లికి చాలా దగ్గరలో ఉంది కనుక పిక్నిక్ కమ్ సెండాఫ్ అక్కడ నిర్ణయించారు.ఉదయం పూట పిల్లలు టీచర్ల ఆటలు పాటలు,ఆతరువాత భోజనాలు అయ్యాయి.అప్పుడు నా గురించి టీచర్లు వాసుదేవు మొదలైన వాళ్లంతా మాట్లాడటం యధావిధిగా జరగిపోయాయి.నాకు స్కూలు వాళ్లు ఖరీదైన వాచీ ప్రజెంట్ చేశారు. దాన్ని తరువాత మా అమ్మాయి టెన్త్ పరీక్షలో మండల స్థాయి ఫస్ట్ వస్తే ఇచ్చేశాను.
మళ్లీ మా అమ్మాయికి ఏదో స్కాలర్ షిప్ వస్తే నాకు తెలియకుండా నాకు వాచీ కొనిచ్చింది.ఆ విషయం ప్రక్కన పెడితే 
 వీడ్కోలు సమావేశం అంతా ఐపోయి పొదిగుగూకే వేళ కావస్తుంది.అందరూ అన్నీ సర్దుతున్నారు.నేను కూడా బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాను.
కుర్తీల్లో కూర్చునినేనూ వాసుదేవు గారు 
ఏదో మాట్లాడుకుంటున్నాం.పదిమంది మగపిల్లలు కొంత మంది పిల్లలు మా చుట్టూ మూగి ఉన్నారు.సారు వెళ్లి పోతున్నాడని బెంగ వాళ్ల కళ్లల్లో కనిపించింది.ఇంతలో సడెన్ గా ఒకబ్బాయి గొల్లుమని ఏడుస్తూ నా కాళ్లమీదపడటం అందర్నీ విభ్రాంతుల్ని చేసింది.నేను వాణ్ని లేపి దగ్గరకు తీసుకుని సముదాయించాను.వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.ఆ తరువాత అందరికీ అర్థమయింది.వాడొక్కడ ఎందుకలా చేశాడో.మాలతి టీచరు వచ్చి
ఒరేయ్ ఏడవకురా!అంటూ వాడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.ఆ సంతూ అనే సంతోష్ వెనుక  ఓ కథ ఉంది అది మరచిపోలేని సంఘటన.అది వివరంగా చెప్పాలి.(సశేషం)
కామెంట్‌లు