శ్రీ కృష్ణ శతకము - పద్యం (౫ - 5)

 కందము :
*క్రూరాత్ముఁ డజామిళుఁడు నారాయణ యనుచు నాత్మ | నందును బిలువన్*
*ఏ రీతి నేలుకొంటివి*
*యేరీ నీసాటి వేల్పు | లెందును కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
అజామిళుడు అను బ్రాహ్మణుడు చాలా పాపాత్ముడు, పరోపకార చింత లేని వాడు, ఎదుటి వారిని ఎలా మోసం చేయాలి అని ఆలోచిస్తూ వుండేవాడు. అటువంటి అజామిళుడు, తన కొడుకుకి *"నారాయణ"* అని పేరు పెట్టుకుని, ఆ *"నారాయణ"* శబ్దం తోనే పిలిచే వాడు.  చివరి ఘడియల్లో కూడా *"నారాయణ"* అని పిలిచినంతనే, పాపాత్ముడు అయిన అజామిళుని కూడా రక్షించావు.  ఇంత దయతో భక్తులను కాచే దైవము నీవు కాకుండా వేరెవరూ లేరు. ....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
*నామగాన ప్రియుడు, గొంతెత్తి ఆర్తితో పలికితే, ప్రకన నిలబడి నడిపించేదేవుడు రమాధవుడే కదా.  అందుకే త్యగరాజుగారు చెప్పినట్టు, "ప్రక్కాల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్పగ రాదా"..,* అంటూ ముందుకు సాగుదాము.
 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు