:"చక్కెర గోళీలు" (పిల్లల కోసం తియ్యని గేయాలు):--యాడవరం చంద్రకాంత్ గౌడ్-తెలుగు పండిట్.-సిద్దిపేట9441762105


 బాలసాహిత్యం అంటేనే గేయాలు ,కథలు ,లాలి పాటలు, జోల పాటలు. అంతేకాకుండా ఒక్కో ఆటకు కు ఒక పాట ఉంది .నిజానికి పిల్లలు నోరు తెరిస్తే చెరువు అలుగు దుoకినట్లు  పాటలు పాడేవారు ఒకప్పుడు. టెక్నాలజీ అభివృద్ధి చెందాక టీవీ, సెల్ ఫోన్ ,కంప్యూటర్ ప్రపంచంలో బాలగేయాలు ప్రస్తుతం మాయమైపోయాయి.

శ్రీ పెందోట వెంకటేశ్వర్లు గారు రాసిన "చక్కెర గోళీలు" బాల గేయాల శీర్షిక చూడగానే నాకైతే పాతికేళ్ల క్రితం బాల్య స్మృతులు ముసురుకున్నాయి. మూడు ,నాలుగు తరగతుల లో బడికి వెళ్లేటప్పుడు  నేను  ఐదు పైసల కు ఒకటి చొప్పున రూపాయికి వచ్చే  చక్కెర గోళీలు కొనుక్కునే వాడిని. ఆ చక్కెర గోలీలు నీటిడబ్బాలో వేసుకొని అవి కరిగిన తర్వాత విరామ సమయంలో తాగేవాళ్ళం. ఆ అనుభూతి వర్ణించలేనిది.
అలాంటి అనుభూతి ఇప్పుడు వెంకటేశ్వర్లు గారి "చక్కరి గోళీలు "అలాంటి అనుభూతిని తెచ్చింది .తీయనైన మధురమైన గేయాలను అందించారు  పెందోటవారు.
విద్యార్థులు చెడు వైపు మళ్లకుండా భావి పౌరులుగా మలచడానికి కవి మాతృభాష, ఉత్సాహం, అభినందనలు, రోడ్డు ,చదువు ,గాంధీజీ లాంటి అనేక అంశాలను చక్కటి, చిక్కటి తీయని గేయాలుగా మలిచాడు.
చదవాలి చదవాలి 
పాఠాలు ఇష్టంగా 
ఆడాలి ఆడాలి మంచి ఆట ఎప్పుడు 
ఈ చదువులు ఈ ఆటలు
భవిత లోన వెలుగులు
అంటూ విద్యార్థులు చదువులు చదవాలని భవిష్యత్తులో వెలుగులు నింపుకోవాలని ఆకాంక్షించాడు కవి.
వందేమాతరం అన్నాడు తెల్లదొరలను తరిమాడు
 స్వాతంత్రం మాకన్నాడు సత్యాగ్రహం పట్టాడు
 దేశ గౌరవం చాటాడు 
జాతీయ జెండా పట్టాడు.
గాంధీజీ గొప్పదనాన్ని చాటుతూ విద్యార్థు ల్లో స్వాతంత్ర్య భావాలు కలిగిoచేలా ఈ గేయాన్ని కూర్చాడు.
కరచాలనం మానండి నమస్కారమేలండి గుంపులుగా ఉండదండి ముక్కుకు మాస్క్ కట్టండి దూరం దూరం జరగండి 
కరోనానే తరమండి.
మాయదారి మహమ్మారి కరోనా నివారణకు జాగ్రత్తలు ఈ గేయంలో అంత్యప్రాసల తో చక్కగా వర్ణించాడు వెంకటేశ్వర్లు గారు
జయం జయం సైనిక 
సాగు ముందు నీవిక 
దేశ రక్షణ ఊపిరిగా
 కర్తవ్యమే ప్రాణంగా
అనే గేయంలో విద్యార్థుల్లో సైనికుల పట్ల దేశ రక్షణ పట్ల అభిమానాన్ని నింపాడు.
మాతృభాషపై పట్టుని కోల్పోకుండా పిల్లలకు బాల్యం నుండి ఇలాంటి గేయాలను అందించడం అభినందనీయం వారు రాసిన ఈ" చక్కెర  గోళీలు" వారి కలం నుండి జాలువారిన ముప్పై మూడవ పుస్తకం.కవి గొప్పతనం ఏమిటంటే పిల్లల కోసమే రచనలు చేస్తూ వారి చేత కమ్మటి రచనలు చేయించడంలో వారికి వారే సాటి.
రాయాలండి రాయాలి వచ్చేదాకా రాయాలి
 రాతలు చక్కగా ఉండాలి ముత్యాల మెరవాలి
 అక్షర దోషం రావద్దు 
వంకర టింకర అసలేవద్దు అందంగా రాయటం ముద్దు 
అంటూ విద్యార్థుల చేతిరాత ముత్యాల్ల,గు గుండ్రంగా ఉండాలని రాతలు గేయంలో వివరించాడు.
వెంకటేశ్వర్లు బాల సాహితీవేత్తగా ,పద్య గేయ కవితలతో పాటు బాలగేయాలు కథలు రాస్తూ ఎన్నో పురస్కారాలు బిరుదులు పొందిన సాహితీవేత్త.కవి గారు రాసిన చక్కెర గోళీలు బాలగేయాల పుస్తకానికి బొమ్మలు ఎంతగానో అందాన్ని తెచ్చిపెట్టాయి .పిల్లల కోసం తీయని గేయాలు అందించిన వెంకటేశ్వర్లు గారికి 
శతథాసహస్ర వందనాలు


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం