పిన్ని -బాబాయ్ ..!! ---శ్యామ్ కుమార్ నిజామాబాద్.

 మా రెండో పిన్ని భయంతో కేకలు పెట్టింది. "ఒరేయ్ శ్యామ్ ముందా దెయ్యం కథలు చెప్పడం ఆపుతావా లేదా "అని  మా పెద్ద పిన్ని నా మీద  పెద్దగా అరిచింది .నేను  ఆనందంగా  పకపకా నవ్వడం మొదలు పెట్టాను వారి భయం చూసి. అది రాత్రి పది గంటల సమయం అందరు హాల్లో పడుకున్నారు.  నేను దయ్యం కథ చెప్తున్నాను. మా వయసు దాదాపు 14 సంవత్సరాలు .సెలవులలో మా నాన్నమ్మ దగ్గర నుండి మా పిన్ని  ఊరికి వచ్చేవాణ్ణి.  మా పిల్లలకి దయ్యాలంటే బాగా నమ్మకం ఉండేది అందుకని రాత్రి కాగానే నేను దెయ్యాల కథలు చెప్పే వాణ్ని చాలా విపులంగా భయపెట్టే విధంగా చెప్పేవాణ్ణి.
 మా పెద్ద  బాబాయి పేరు అప్పల చారి గారు. వేరే ఊర్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు .పెద్ద పిన్ని పేరు సత్యవతి. తనకు ముగ్గురు సంతానం .పల్లెటూరు రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో, చాలా పనులు చేస్తూ అందరి కంటే తెలివి మరియు లౌక్యం ప్రదర్శించేది. తాను ఎక్కడ ఉంటే నేను అక్కడ  వుండి, వంటలో కూడా సహాయం చేసే వాడిని .ఎవరికీ తెలియని కుటుంబం విషయాలను కూడానాతో పంచుకునేది . ఆ  విధంగా నాకు అందరు గురించి మంచి అవగాహన కలిగింది.మంచి క్రమశిక్షణ కట్టుబాట్లు చేసేది. మా బాబాయ్ చాలా లోతైన వ్యక్తి ,కానీ ఎప్పుడూ నవ్వుతూ ,సంతోషంగా గడిపే వారు.
 ఒకసారి వీధిలోకి ,జామకాయలు అమ్మకానికి వచ్చాయి. మేము దాచుకున్న మట్టి హుండీ తీసి అది పగలగొట్టి ,అందులో నుంచి డబ్బులు తీసి జామకాయలు కొన్నారు. నేను చాలా ఆశ తో ఎప్పుడు తిందామా? అని ఎదురు  చూస్తున్నాను. వాటితో జామ్ చేద్దామని మా బాబాయి ప్లాన్ వేశారు తానే వంట ఇంట్లో కూర్చొని, వాటన్నిటి తోటి జామ్ తయారు చేశారు. తీరా చూస్తే అది  తినటానికికూడా వీలు లే నంత చండాలంగా తయారైంది.  మొత్తానికి ఆ పండ్లనుసర్వనాశనం చేసి బయట పడేశారు. నేను దాచుకున్న డబ్బులు పోయాయి ,పైగా  కనీసం జామకాయలు కూడా  తిన లేకపోయాను!
 రాత్రిపూట తినగానే మా బాబాయి కి,కాలు    నొక్కించుకు నే
  అలవాటు ఉండేది. ఒక సారి నేను పడుకుని పిలిస్తే పలక కుండా నిద్ర  పోతున్నట్టుగా ఉలుకూ- పలుకూ లేకుండా పడుకున్నాను.   " అరే పిల్లలు పడుకున్నారా!సినిమాకి  తీసుకొని వెళ్దామని అనుకున్నాం" అని అన్నారు బాబాయ్. "లేదు -లేదు" అంటూ లేచి  కూర్చున్నాము. "పడుకోలేదా ?అయితే నా కాళ్ళు నొక్కండి "అని అంటూ పట్టుకున్నారు. అప్పుడు మాకు అర్థం అయింది మేము  బుద్ధి లేకుండా ఎలా ట్రాప్ లో పడిపోయా మోనని!
 మా బాబాయ్ కి మంచి కెమెరా ఉండేది .దాంతో ఎప్పుడూ మా అందరి ఫోటోలు తీసుకునే వారు .ఆ రోజుల్లో చాలా డబ్బు ఖర్చు అయినా సరే ప్రతి చిన్న విషయానికి ఫోటో తీసేవారు.అందుకే నాకు చిన్నప్పటి ఫోటో లు చాలా ఉన్నాయి. ఫోటోగ్రఫీ  చాలా గొప్పగా చేసేవారు. తాను చేసే మేనేజర్ ఉద్యోగం చాలా ముఖ్యమైంది కనుక ,తనకు వాడుకోవడానికి రకరకాల స్కూటర్లు తెచ్చేవారు. నేను ఒకసారి చాలా సంతోషంగా ,"బాబాయ్  ఎప్పుడూ కొత్త  స్కూటర్  లు తెస్తారు" అన్నాను.
 "అవునురా, అడుక్కు తినేవాడికి 60  కూరలు" అన్నారు . ఆ వయసులో నాకు దాని అర్థం తెలియదు కానీ తర్వాత తలుచు కొన్నప్పుడల్లా నవ్వు వస్తున్టున్ది.ఆ..రోజులే వేరుమరి!
    
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం