దేవుడెక్కడుంటాడో:-- యామిజాల జగదీశ్

 గురుశిష్యులిద్దరు ఓ అడవి మార్గంలో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు. కొంతదూరం వచ్చేసరికి ఓ సింహం కనిపించింది. దాన్ని చూసిన శిష్యుడు మరో మాట లేకుండా పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. 
కానీ గురువు ఏమాత్రం భయపడక ఉన్న చోటనే కూర్చుండిపోయి కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. గురువు దగ్గరకొచ్చిన సింహం ఏమీ చేయకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయింది. 
ఓ అయిదు నిముషాలకు చెట్టెక్కిన శిష్యుడు కిందకు దిగాడు. 
గురు శిష్యులిద్దరూ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేపట్టి నగరం చేరారు. ఇంతలో ఎదురుగుండా ఓ ఎద్దు రావడం చూసిన గురువు అక్కడి నుంచి పరుగుతీసాడు. 
శిష్యుడికి గురువు తీరు అర్థం కాలేదు. 
అడవిలో సింహం ఎదురొస్తేనే ఏ మాత్రం భయపడని గురువు నగరంలో ఎదురొచ్చిన ఎద్దుకు భయపడి పరుగెత్తారేమిటి అని అనుకున్నాడు. ఎందుకలా చేసారని గురువుని ప్రశ్నించాడు. 
అప్పుడు గురువు "సింహం ఎదురొచ్చినప్పుడు మనం అడవిలో ఉన్నాం. అక్కడ అది అందమైన ప్రకృతి. కల్మషం లేని ప్రకృతి. కనుక దేవుడు అంతటా ఉన్నాడు. నా ప్రార్థనకు తక్షణమే స్పందించిన దేవుడు మనకేమీ జరక్కుండా చూసాడు. కానీ ఎద్దు ఎదురొచ్చినప్పుడు మనం నగరంలో ఉన్నాం. నగరంలో ఎటు చూసిన వంచనా పగలూ ప్రతీకారాలూ. ఇటువంటి నగరంలో దేవుడెక్కడుంటాడో తెలీదు. కనుక నన్ను కాపాడుకోవడానికి పరుగులు తీశాను. అందుకు దేవుడు రెండు కాళ్ళిచ్చాడుగా" అన్నాడు.
శిష్యుడికి విషయం బోధపడింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం