కోవిడ్ వేళ పిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు::---- అంతర్జాల సమావేశంలో కృతికాశుక్లా వెల్లడి

 కోవిడ్ రెండో దశ అధికమవుతున్న వేళ రాష్ట్రంలోని పిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఏపి మహిళా శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్  కృతికాశుక్లా వెల్లడించారు. 
సోమవారం మధ్యాహ్నం పిల్లల సంరక్షణ భాగస్వాములతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి  అంతర్జాల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల సంక్షేమం,  సంస్కరణ సేవలు, వీధిబాలల సంక్షేమశాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు ప్రసాదమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతపురం నుంచి బాలల సంక్షేమ సమితి (సిడబ్ల్యూసి) అధ్యక్షురాలు నల్లాని రాజేశ్వరి, జిల్లా బాలల పరిరక్షణాధికారి (డిసిపిఓ) డా. దాసరి సుబ్రమణ్యం మాట్లాడారు. 
పిల్లలకు కరోనా సోకకుండా బాలల సంరక్షణ కేంద్రాలు (సిసిఐ) అన్ని జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కృతికాశుక్లా సూచించారు. పిల్లలకు, సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలను సంరక్షించేందుకు సైతం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. తక్షణమే 1098, 181 వంటి హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో బాల బాలికలకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్షేత్రస్థాయి నుంచీ ప్రతిరోజూ తాజా సమాచారం తెప్పిస్తున్నామని తెలిపారు. లక్ష్య సాధనకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
ఆన్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని కరోనా రాకుండా పిల్లలను కాపాడాలని సూచించారు. 
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో,  ఆర్డీటి సంస్థ సహకారం తీసుకుని ముందుకు సాగుతున్నామని నల్లాని రాజేశ్వరి అన్నారు. 
సిసిఐ లకు సుప్రీంకోర్టు, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కూడా అందజేశామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శీల సేవలను సద్వినియోగం చేసుకునేలా ఆదేశాలివ్వాలని డిసిపిఓ సుబ్రమణ్యం సూచించారు. 
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి సభ్యులు, ఐసిపిఎస్ అధికారులు, సిబ్బంది, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం