ఎప్పుడు కొంటానో చదువుతానో:-- యామిజాల జగదీశ్

 సెంట్రల్ యూనివర్సిటీ వారు, ఎమెస్కో వారు సంయుక్తంగా ప్రచురించిన "వర్ణన రత్నాకరం" నాకెంతో ఇష్టమైన పుస్తకం. ఇవి మొత్తం ఇరవైమూడు సంపుటాల సెట్టు. సాహిత్యంమీద మక్కువ కలవారు చదివి భద్రపరచుకోవలసిన పుస్తకాలివి అని నా వ్యక్తిగత అభిప్రాయం.
మన మహాకవులు తమ తమ కావ్యాలలో అవసరమైన సందర్భాలలో వర్ణనలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో తెలియంది కాదు. వర్ణనల నిర్వచనానికి నిదర్శకులని చెప్పడం చిన్న మాటే అవుతుంది. వారి వర్ణనా తీరు  తెలుసుకోవడానికి కావ్యాలు చదివితేనే తెలిసొస్తుంది. కానీ కావ్యాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా అంటే ఒకింత అనుమానమే. అయినా అన్ని కావ్యాలూ కొని చదవగలమా.... కానీ ఆ సమస్యను తగ్గించి వివిధ కావ్యాలలో ఉండే వర్ణనలను టీకా తాత్పర్యాలతో ఈ "వర్ణన రత్నాకరం" మనముందుంది. ఎవరో చెప్పి వినడంకన్నా స్వయంగా చదివి ఆస్వాదించడానికి వర్ణన రత్నాకరం సంపుటాలలో మొదటి పదీ నా దగ్గరున్నాయి. 
నౌకరీ చేస్తున్న రోజుల్లో డబ్బులు మిగుల్చుకుని అప్పుడప్పుడూ ఒకటీ రెండూ వంతున తొలి పది భాగాలూ కొనగలిగాను.  ఇంతలో రిటైరైపోవడంతో డబ్బులాడక మిగిలినవి కొనలేకపోయాను. కానీ ఎలాగైనా కొనాలనే ఆరాటమైతే కించిత్ కూడా తగ్గలేదు. 
ఇంతలో అనుకోకుండా ఓ పని చేసినందుకు ఓ ఆరు వందలు అందాయి. వాటితో ఓ మూడు సంపుటాలైనా కొందామని నాకు బాగా పరిచయమున్న ఓ పుస్తకాల దుకాణానికి వెళ్ళాను. మూడు భాగాలు అయిదు వందల యాభై రూపాయలకు ఎంపిక చేసుకుని బిల్లు వేయించుకుని మహదానందంగా ఇంటికి వచ్చి చదివెయ్యాలనుకున్నాను. క్యాష్ కౌంటర్ కొచ్చి బిల్లు వేయించుకుందామని నిల్చోగా ఆ షాపు సిబ్బంది ఒకరు "మూడు భాగాలు ఇవ్వడం కుదరదండి. అవి సెట్టుగా ఇరవైమూడూ కొనాల్సిందే" అన్నారు. 
"ఇదేంటీ, మొదట్లో ఒకటి రెండూ పుస్తకాలు ఇక్కడే మీ షాపులోనే కొన్నానండి" అని ఆ మనిషితో అంటూనే కౌంటర్లో ఉన్న వ్యక్తి బాగా తెలిసిన వా‌రవడంతో ఆయన ఇస్తారన్న ఆశతో నిలబడితే "ఇంపాసిబుల్" అండి కొంటే ఇరవైమూడు భాగాలూ కొనండి లేదంటే ఎక్కడ తీసారో అక్కడ పెట్టేయండి అని ఆ సిబ్బంది అనడంతో మనసు చివుక్కుమంది. ఓ మంచి మనసుని కోల్పోయినంతగా బాధపడ్డాను. ఆఖరి క్షణంలో అనుకున్నది చేజారితే ఎంత ఆవేదన కలుగుతుందో అంతలా నలిగిపోయింది నా మనసు. జీవితంలో విలువైనదేదో కోల్పోయినంతగా బాధపడిపోయి ఆ మూడు పుస్తకాలనూ ర్యాక్ లో పెట్టేసి మరుక్షణం షాపులో నించి బయటపడ్డాను. నిజానికి ఆ షాప్ కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక పుస్తకం కొనుక్కునిగానీ ఇవతలకు రాను. అంతేకాదు షాప్ సొంతదారులతో బోలెడు కబుర్లు చెప్పీ చెప్పించుకోవడం సర్వసాధారణంగా జరిగేవే. అలాంటిది ఈసారి అనుకున్న మూడు పుస్తకాలూ కొనలేకపోయానే అనే బాధతో ఏదో ఓడిపోయినంతలా ఏదో చేదు అనుభవాన్ని చవిచూసినవాడిలా వెనక్కు వచ్చేసాను.
కారణం, వర్ణన రత్నాకరంపై ఉన్న ప్రేమ. అభిమానం. రత్నాకరమంటే సాగరం. ఈ వర్ణన రత్నాకర సెట్టు ఓ మహాసాగరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలే. ఒకే అంశాన్ని ఆయా కవులు ఎన్ని విధాలుగా వర్ణించారో, వారి దృష్టి ఎన్ని కోణాలలో ప్రసరించిందో తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు చదివితీరాలి. అవి చదువుతుంటే మన హృదయం ఆనందంతో వికసిస్తుందనడం అతిశయోక్తికాదు.
మన మహాకవుల వర్ణనలు పద్యాలపై పట్టులేని నాలాంటి వారు చదివితే అంత తేలికగా అర్థంకావు. అయితే వాటిని అర్థం చేసుకుని ఆస్వాదించడానికి అతి సరళమైన వ్యాఖ్యానాలతో బేతవోలు రామబ్రహ్మంగారు తదితరులు పాఠకుల ముందుంచడం ముదావహం.
ఈ శేషజీవితంలో మిగిలిన పదమూడు సంపుటాలు ఎలాగైనా కొని చదవాలని ఆశ. నెరవేరేనా లేక నిరాశగా మిగిలిపోతుందా....??? ఎందుకంటే డబ్బులు లేక చేతులు కట్టేసినట్టవడంతో ఆశ పండటం అనుమానమే.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం